రాష్ట్రీయం
మినరల్ ప్లాంట్ ఉందో లేదో కానీ మద్యం షాపులు:జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 13 February 2018
ఉదయగిరి: చంద్రబాబు పాలనలో గ్రామాల్లో మినరల్ ప్లాంట్ ఉందో లేదో కానీ మద్యం షాపులు మాత్రం ఉన్నాయనివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరిలో ఆయన తన పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బయటకు తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు వారిని కూడా మోసం చేశారని తెలిపారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలన్నారని, జాబు రావాలంటే బాబు రావాలన్నారని, అవన్నీ వచ్చాయా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అన్ని కులాల వారికి ఎన్నో హామీలు ఇచ్చి వారంరినీ మోసం చేశారని తెలిపారు.