రాష్ట్రీయం
గవర్నర్ను కలిసిన జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 April 2019
హైదరాబాద్: వైకాపా అధ్యక్షుడు జగన్ మంగళవారంనాడు గవర్నర్ నరసింహాన్ కలుసుకున్నారు. పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాజ్భవన్కు వెళ్లిన ఆయన గవర్నర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. శాంతిభద్రతల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారని జగన్ విమర్శించారు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్రూములు తెరవాలన్నారు. స్ట్రాంగ్రూముల దగ్గర పారామిలటరీ బలగాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసి సీఈవో, సీఈసీ పర్యవేక్షించాలని జగన్ అన్నారు.