ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమితో అధికారుల గుండెల్లో రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేనెల 2వ తేది నుంచి తిరిగి ప్రారంభంకానున్న జన్మభూమి కార్యక్రమంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకే అధికారులు వెళ్లి అర్జీలు స్వీకరించి, సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. రేషన్‌కార్డులు, పెన్షన్లు, శాశ్వత గృహాలు, ఇళ్ల స్థలాలు, వౌలిక సదుపాయాల్లో భాగమైన రోడ్ల నిర్మాణాలు , తాగునీటి సమస్య, విద్యుత్ వంటి సమస్యలు ఇప్పటికే పలు గ్రామాల్లో తిష్టవేసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత అధికారపార్టీ నేతలు వైకాపానే టార్గెట్ చేసుకుని ఎదురుదాడికి సన్నద్ధమవుతున్నారు.