ఆంధ్రప్రదేశ్‌

ఆర్మీ కెప్టెన్ వీరమరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్:ఉగ్రవాదులతో జరుగుతున్న కాల్పుల్లో సైన్యానికి చెందిన కెప్టెన్ పవన్‌కుమార్ (22) వీరమరణం పొందారు. శనివారం సాయంత్రం బస్సుపై కాల్పులతో దాడికి దిగిన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు పోరాటం ప్రారంబించిన పదిమంది సైనికుల బృందాన్ని ముందుండి నడిపించిన పవన్ కాల్పుల్లో గాయపడి ఆదివారం ఉదయం మరణించారు. కాగా శనివారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక పౌరుడు, ఇద్దరు సైనికులు మరణించిన విషయం తెలిసిందే. కాగా సైన్యం కాల్పులతో ఓ ప్రభుత్వ భవనంలోకి జొరబడిన తీవ్రవాదులను పట్టుకునేందుకు సైన్యం ప్రయత్నిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం వరకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. కాగా దేశమాత రక్షణకోసం నా కుమారుడు అమరుడయ్యాడని పవన్ తండ్రి ఉద్వేగంతో అన్నారు. దేశానికి ఇంతకన్నా ఏమివ్వగలనని ఆయన అన్నారు.