కడప

వడదెబ్బతో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, ఏప్రిల్ 15: మండలంలోని సుంకేసుల గ్రామానికి చెందిన కొర్రు అంజనయ్య (40) వడదెబ్బతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే మండలంలోని సుంకేసుల దళితవాడకు చెందిన అంజనయ్యకు భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. వృత్తి రిత్యా హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రోజు మాదిరిగానే కూలి పనులకు వెళ్లి వచ్చి ఆకస్మికంగా పడిపోవడంతో ప్రథమ చికిత్స నిమిత్తం వైద్యాధికారి బాలస్వామి వద్దకు రాగానే మృతిచెందినట్లు వైద్యులు దృవీకరించారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

పత్తూరు వద్ద అదుపుతప్పిన లారీ
ఖాజీపేట, ఏప్రిల్ 15: మండలంలోని పత్తూరు జాతీయ రహదారి వద్ద లారీ అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్ నారాయణ, జాఫర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే మైదుకూరు నుండి కడపకు సిమెంట్ లోడుతో వెళుతున్న రాయచోటికి చెందిన లారీ పత్తూరు వద్ద వ్యక్తిని తప్పించబోయి డివైడర్లపైకి దూసుకుపోయింది. దీంతో లారీ పూర్తిగా ధ్వంసమై ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. రాత్రి హైవే కాపుకాస్తున్న పోలీసులు లారీలోని డీజిల్‌ను ఎత్తుకెళ్లినట్లు లారీ డ్రైవర్, క్లీనర్లు వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కూడా వెల్లడించారు.