కడప

వడదెబ్బకు ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనగలూరు, ఏప్రిల్ 22: ఎండ తీవ్రతకు తాళలేక వడదెబ్బకుగురై ఇద్దరు వృద్ధులు శుక్రవారం మృతి చెందాడు. మండలంలోని శింగారెడ్డిపల్లె గ్రామానికి చెందిన పాలా కృష్ణయ్య (62) గత వారం రోజులుగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. శుక్రవారం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృతి చెందినట్లు కృష్ణయ్య కుమారుడు గరి తెలిపారు. ప్రస్తుతం 42 డిగ్రీల ఉష్ణోగ్రతకు మండల వ్యాప్తంగా వడగాలులు వీచడంతో మండలంలోని వృద్ధులు, చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.
మంగంపేటలో మరొకరు
ఓబులవారిపల్లె: మండలంలోని కొత్త మంగంపేటకు చెందిన పసుపులేటి వెంకటయ్య (60) అనే వృద్ధుడు శుక్రవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. గత వారం రోజులుగా ఎండల తీవ్రతతో వెంకటయ్య ఆనారోగ్యంతో బాధపడుతుండగా రైల్వేకోడూరులోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందించినా ప్రయోజనం లేకపోయిందని బంధువులు తెలిపారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.