కడప

చంద్రబాబు అసమర్థత వల్లే కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాపురం, మే 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసమర్థత వల్లనే ఎగువనున్న గోదావరి నదిపై అక్రమంగా తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులు నిర్మిస్తోందని మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా జలదీక్ష సంఘీభావం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ జలదీక్ష వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించడం చాలా సంతోషమని గోదావరి, కృష్ణా నదుల ఎగువనున్న తెలంగాణ సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో శ్రద్ధతో ముందుచూపుతో ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలని ధర్నా చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ప్రతివిమర్శలు చేస్తున్నారు తప్ప వాస్తవాన్ని గ్రహించాలన్నారు. సీఎం చంద్రబాబు ఓటుకు నోటు కేసులో కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. ఇప్పటికైనా అక్రమ ప్రాజెక్టులు అడ్డుకొని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మేలు చేకూరే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే సీమ ఎడారిగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నస్రీన్‌సుల్తానా, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ఉపాధ్యక్షుడు రాజారెడ్డి, యువనాయకుడు సుబ్బారెడ్డి, ప్రశాంతరెడ్డి, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, విద్యార్థి సంఘ నాయకుడు ఆర్‌వి బాష, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం తహశీల్దార్ మాధవక్రిష్ణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.