కడప

జగన్‌వి పగటి కలలు : రెడ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,జూలై 19: వైకాపా అధినేత జగన్ ఒకటి రెండు సంవత్సరాల్లో అధికారంలోకి వస్తామని పగటికలలు కంటూ ప్రజాస్వామ్యాన్ని ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఖాజీపేటలో మంగళవారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ జ్యోతిష్యులు చెప్పారని, ఆరునెలల్లో అధికారం నాదేనని ఒకసారి, సంవత్సరంలో అధికారంలోకి వస్తానని మరోసారి, రెండేళ్లలో అధికారంలోకి వస్తానని మాట్లాడుతున్నారని అధికారంలోకి రాకపోవడం, అధికారంలోకి రాలేమని భావించడం, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వైకాపా శ్రేణులు టిడిపిలోకి వలసలు రావడంతో దిక్కుతోచని స్థితిలో మానసిక స్థైర్యం కోల్పోయి అసందర్భప్రేలాపణలు చేస్తున్నారన్నారు.
టిడిపి వైఫల్యాలే లేనప్పుడు గడప గడపకు వైకాపా ఎండగట్టాలని జగన్ మాట్లాడటం మతిభ్రమించడమేనన్నారు. ప్రజాసమస్యలపై అజెండా లేని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని గెలిపించుకునేందుకు సొంతపార్టీ శాసన సభ్యులకే డబ్బులు ఇచ్చిన నేత జగన్ అన్న పిసిసి అధ్యక్షుడు రఘువీరా వ్యాఖ్యలపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మైదుకూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ శ్రీరాములుయాదవ్, మార్కెట్ యార్డు డైరెక్టర్ బచ్చల శ్రీనివాసులు, బొంగు శ్రీను, రమణ, లక్ష్మిరెడ్డిలు పాల్గొన్నారు.