కడప

సాయినాథుని దీవెనలతో ప్రజలు వర్ధిల్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం,జూలై 19: సద్గురు సాయినాథుని దీవెనలతో ప్రజలు వర్ధిల్లాలని విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాను వేడుకున్నారు. మండలంలో ని భాకరాపేట సమీపంలో ఉన్న 11వ ఎపిఎస్‌పి బెటాలియన్ సమీపంలోని షిర్డిసాయిబాబా ఆలయంలో మంగళవారం జరిగిన గురుపౌర్ణమి మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన సాయినాథునికి అభిషేకాలు తదితర పూజలుచేసి అన్నదాన కార్యక్రమాన్ని ఆయనతోపాటు బెటాలియన్ కమాండెంట్ సామ్యూల్ జాన్సల్‌లు ప్రారంభించారు. అలాగే క్వార్టర్స్‌లో సాయినాథుని గ్రామోత్సవం వైభవంగా జరిగింది. రాత్రి బద్వేలు అనూస్ డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో రాజంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఖాజా, ఎంపిపి రామిరెడ్డి నరసింహారెడ్డి, మహిళా నాయకురాలు రాజేశ్వరీరెడ్డి, మాజీ ఉపమండలాధ్యక్షుడు దశరధరామానాయుడు, మాజీ జెడ్పిటిసి చలమయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాసులునాయుడు, తెలుగు యువత మండల అధ్యక్షుడు నగేష్‌నాయుడు, టిడిపి మండల ప్రధానకార్యదర్శి సుబ్బయ్య, బిసినాయకులు కృష్ణయ్య, మాజీ సర్పంచ్ కెవి సుబ్బయ్య, బ్రహ్మయ్య, సర్పంచ్ నర్సయ్య, అనుకూలయ్య పాల్గొన్నారు.