రాష్ట్రీయం

చౌటుప్పల్‌లో ఫ్లోరిన్ పరిశోధనా కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
సంస్థాన్‌నారాయణపురం, డిసెంబర్ 12: ఫ్లోరిన్ మహమ్మారిని పారదోలడానికి కేంద్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని మల్కాపురం గ్రామంలో ఫ్లోరిన్ పరిశోధనా కేంద్రం నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. చిమిర్యాల గ్రామంలో భారత్ వికాశ్ పరిషత్ చారిటబుల్ ట్రస్టు 10లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను శనివారం కిషన్‌రెడ్డి ప్రారంభించారు. గత ప్రభుత్వాల మూలంగా ఈ ప్రాంతం ప్రజలు ఫ్లోరిన్ విషపునీటిని తాగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ ఫ్లోరిన్ పీడ నుంచి ప్రజలను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఫ్లోరిన్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనుందన్నారు. ఇదిలావుండగా, ప్రధాన మంత్రి మోదీ దేశ ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారని, నిరుద్యోగ యువత కోసం అనేక పరిశ్రమలను మేక్‌ఇన్ ఇండియా ద్వారా ప్రవేశపెడుతున్నారని అన్నారు.