రాష్ట్రీయం

రోడ్డు ప్రమాదంలో పెళ్లికుమారుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: జిల్లాలోని కొణిజెర్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమారుడుతో సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వర్థన్నపేటకు చెందిన అచ్చి రామకృష్ణప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అమ్మాజీ దుర్గతో పశ్చిమ గోదావు జిల్లా తణుకులో వివాహం జరిగింది. వివాహం అనంతరం ఇన్నోవా వాహనంలో వర్ధన్నపేటకు వస్తుండగా కొణిజర్ల సమీపంలో ఇన్నోవా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొన్నది. ఈ ఘటనలో పెండ్లి కుమారుడు అచ్చి రామకృష్ణప్రసాద్‌తో సహా వరుడి బంధువులు శరత్, శ్రీదేవి, పద్మ, డ్రైవర్ వేణు దుర్మరణం పాలయ్యరు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.