ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే బుధవారం కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో జలమట్టం తక్కువగా ఉందని, నీటి విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి తాగునీటి సరఫరా కొనసాగాలని, నెట్టంపాడు, భీమా, కల్వకుర్తి ట్రయల్‌రన్‌కు నీరుకావాలని తెలంగాణ ఈఎంసీ మురళీధర్‌ కోరారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు, కాల్వలను పరిశీలించి సెన్సార్లు ఏర్పాటు స్థానాలను ఖరారు చేస్తామని సమీర్‌ ఛటర్జీ వెల్లడించారు.