క్రైమ్/లీగల్

గుడివాడ ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జూలై 27: గుడివాడ రాజేంద్రనగర్లోని ఆర్టీవో కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో తిరుగుతున్న 15మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని వారి నుండి లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ ప్రసాద్ విలేఖర్లతో మాట్లాడుతూ ఆర్టీవో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా వచ్చిన పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. లెర్నింగ్ లైసెన్స్‌ల కోసం వచ్చే వారికి కార్యాలయంలో కంప్యూటర్ ద్వారా పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైతేనే ఎల్‌ఎల్‌ఆర్‌లను మంజూరు చేయాల్సి ఉందని, అయితే ఈ సెక్షన్‌కు చెందిన ఎంవీఐ అనధికారికంగా ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా ఫిర్యాదులున్నాయన్నారు. దీనిపై ఇన్‌ఛార్జి ఆర్టీవోతో పాటు సిబ్బందిని కూడా విచారిస్తున్నామని, పూర్తివివరాలను ఉన్నతాధికారులకు పంపుతామని ఆయన తెలిపారు.