రాష్ట్రీయం

చండీయాగం చందాలపై వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుయాష్కి డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 21: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆయుత చండీయాగం పేరిట రాష్ట్రంలోని వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసిన చందాల వివరాలను వెంటనే బయట పెట్టాలని ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి గౌడ్ డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ఇదో రకమైన కుంభకోణంగా విచారణ చేపట్టాలని సిబిఐని కోరుతామని ఆయన విలేఖరుల సమావేశంలో తెలిపారు. క్విడ్ ప్రొకో తరహాలో రాష్ట్రంలోని తెలంగాణేతర కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించి పెట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ వారి నుంచి చండీయాగం పేరిట చందాలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిర్ తన వ్యక్తిగత హోదాలోనే యాగాన్ని నిర్వహించాలనుకుంటే తనకు వచ్చిన చందాలను బహిర్గతం చేయాలని అన్నారు.