ఆంధ్రప్రదేశ్‌

8న ఒంగోలులో మహాసంకల్ప సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఈ నెల 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నవనిర్మాణ దీక్ష కార్యక్రమం పూర్తయ్యాక 8వ తేదీన ఒంగోలులో మహాసంకల్ప సభను నిర్వహించాలని ఎపి క్యాబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతను బుధవారం ఇక్కడ జరిగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీలోగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని, 20 నుంచి 30వ తేదీలోగా పల్స్ సర్వే జరపాలని, ఈనెల 27లోగా హైదరాబాద్‌లోని ఎపి ఉద్యోగులంతా అమరావతికి తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అమరావతిలో ఉద్యోగులకు తగిన సౌకర్యాలను ఏర్పాటు చేసే బాధ్యత సిఆర్‌డిఎ అధికారులదేనని సిఎం స్పష్టం చేశారు.