మెయిన్ ఫీచర్

పరమాత్మ-జీవాత్మలకు భేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజోపి సన్నవ్య యాత్నా భూతానా మీశ్వరోపి సన్
ప్రకృతిం స్వా మధిష్టాయ సంభవా మ్యాత్మమాయయా
భావం: నేను నిర్వికార నిరంజనుడైనను, చావు పుట్టుకలు లేనివాడనైనను అన్ని భూతములకు అధికారినైనను, నా మాయను వశము చేసికొని నా మాయవలన పుట్టుచున్నాను.
దీనిని బట్టి భగవానులకు సాకార నిరాకారములు రెండును గలవని రూఢియగుచున్నది. ఒక నాణెమునకు రెండు ప్రక్కలున్నచో అట్లే భగవానులు రెండు స్థితులతో ఎప్పుడు ఉన్నట్లు తెలియబడుచున్నది.
శ్రీరామకృష్ణ పరమహంస గురువునకు ఎరుక పడజేయదలచెను. తోతాపురి తన ఇష్టం వచ్చినప్పుడు సమాధిలో నుండగల స్థితిని సంపాదించి యుండెను. సమాధిలో ఉన్నప్పుడు అతడు బాహ్య ప్రపంచమును మఱచు చుండెను. ఒకనాటి రాత్రి తోతాపురి అమితముగా బాధపడుచుండెను. కూర్చుండినను, మరల లేచి నిలువబడినను, మరల పరుండి ఉన్నను అతని బాధ పోలేదు. ఆ సమయమున తన మనస్సును బ్రహ్మముపై ఏకాగ్రత పరచి దేహబాధను మరచుటకు తలపోసికొనియెను. కానీ మనస్సును ఆ స్థితికి తీసికొని వచ్చుటకు ముందే, మనస్సు జారి, దేహబాధను మరపించలేక పోయెను. ఎన్ని పర్యాయములు ప్రయత్నించినను నిష్ఫలమయ్యెను. దేహమును గురించి విసుగుపడి ‘‘ఈ పాడు దేహ సంబంధముచేత మనస్సు కూడ వశము కాకున్నది. ఈ దేహముతో సహవాసము చేసి నేనేల బాధపడవలయును? ఈ దేహమును మోయుట వలన నేమి ప్రయోజనము? కావున దీనిని గంగానది కర్పించి, బాధలను తుదముట్టజేసెదను’’ అని రూఢి పరచుకొని, తోతాపురి మనస్సును పరబ్రహ్మయందు చేర్చి గంగానదిలో దిగుటకు జొరబడెను. ఏమి ఆశ్చర్యము? ఎంత దూరము నడిచినను, గంగానది జలములు మోకాళ్ల నైనను తడుపలేదు. అవతలి ఒడ్డుకు చేరెను. ఆ రాత్రి గంగ ఎండి పోయినదా ఏమి? అర్ధరాత్రి సమయము. అవతలి ఒడ్డున ఇండ్లు, చెట్లు నీడల వలె నిలువబడి ఉండుట చూచెను. చకితుడై అతడిట్లు తలచెను. ‘‘ఈ రోజున నేను మున్గుటకు కావలసినంత జలమైనను లేకపోయెనేమాయాబల మింతయని చెప్పగలమా? భగవంతుని లీలచెంత చిత్రములు’’ అంతలోనే తన చుట్టుపక్కల ఎటు చూచిననూ జగన్మాద యగుకాళీ స్వరూపమే కనపడుచుండెను. ఆ జ్యోతిర్మయి ముఖమండలము చేతనే దిగంతరాళములు నిండి యుండెను. తన జీవిత కాలమంతయు బ్రహ్మమును గురించి ధ్యానించుచుండెనో ఆ బ్రహ్మమే ఈనాడు జగన్మాత అయ్యెను. మరల యథాస్థానమునకు చేరి తోతాపురి అగ్ని రగిల్చి చలికాచుకొనుచు కాళీ ధ్యానానంద నిమగ్నుడై యుండెను. ప్రాతఃకాలమయ్యెను. ఈ జరిగినదంతయు సవిస్తరముగా పరమహంస గారికి తెలియజేసెను. శ్రీరామకృష్ణ పరమహంస గారు చిరునవ్వు నవ్వి ఆ మా అమ్మను విశ్వసింపుమని చెప్పగా నీవు నమ్మనంటేనే నన్ను కూడా నమ్మవలదని చెప్పితివే ఇప్పుడు చూచితిమా? మాయమ్మ నిజమో! అబద్ధమో! బ్రహ్మము, శక్తి ఈ రెండును వేరుచేయబడునని కాననియు, అగ్ని, దాని యుష్ణమువలె ఉండుననియు మా యమ్మ చాలాకాలము నాడే బోధించినదిలే’’ యని తోతాపురికి చెప్పెను. కావున సాకార నిరాకారములు వేరుచేయబడనివని ఊహింపవలెను.

-వద్దూరి రామకృష్ణ సెల్: 7780797588