మెయిన్ ఫీచర్

సాధనతో అద్భుతాలు ( పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ చక్రము- మానవశరీరము
ప్రతులకు
H.No. 7-8-51, Plot నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
=============================================================
ప్రస్తుత కాలమున గూడ తమ ఉపాసనాబలంతో దేవీమాత భగవతి అనుగ్రహంతో ఆహార పానీయాలు స్వీకరించకుండా చిరకాలము జీవిస్తున్నవారక్కడక్కడా వున్నారు. అందరూ చూడగలిగే ఒక ఉదాహరణ ఇక్కడ పేర్కొంటాను. గుజరాత్ రాష్ట్రంలో ‘శ్రీ మాతాజీ బాబా’ (ప్రహ్లాద జైనీ) అనే ఆయన ఒక గ్రామంలోని అమ్మవారి ఆలయంలో దీక్షలో వుంటారు. ఆయన అమ్మవారిలాగానే అలంకరణ చేసుకుని నిరంతరం అమ్మవారి ధ్యానయోగంలో వుంటారు. ఆయన గత అరవై ఐదు సంవత్సరాలుగా ఆహార పానీయాలు లేకుండా వున్నారు. వైద్యుల బృందం ఆయనను అన్ని రకములుగా పరీక్షించి చూశారు. ఆయననొక మూత్రశాల లేని గదిలో కొంతకాలముంచి సిసి కెమెరా పెట్టి కూడా గమనించారు. ఆయన పానీయాలు, మలమూత్ర విసర్జన లేకుండా ఉన్నారని వైద్యబృందం గమనించారు. ఈ విషయానికి సంబంధించి పాఠకులు అంతర్జాలం యూట్యూబ్‌లో మాతాజీ బాబా అని టైప్ చేసి వీక్షించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇట్టి అతీంద్రియ శక్తులు సాధించటానికి మానవ శరీరము అనుకూలమైనదేనని మరియొకసారి రుజువైంది.
పతంజలి మహర్షి తన కైవల్య పాదమునందలి 12వ శ్లోకంలో కాలము గురించి రుూ విధంగా చెప్పారు.
శ్లో ‘‘అతీత నాగతమ్ స్వరూపతోన్
స్త్యధ్వ భేదార్థర్మాణామ్ అనగా గుణములు వ్యతిరేక దిశలో నుండుట వలన, భూత భవిష్యత్తులు, వాటి కాలము నెలకొని ఉన్నది. కాలమనేది గ్రహించగలిగినంతటి వేగంతో ప్రవహిస్తున్న శక్తి. దీనియొక్క స్పర్శయే వర్తమానము, అట్టి శక్తికై తయారుకావడమే భవిష్యత్తు. అనుభవించిన శక్తియే భూతకాలము. నేటి శాస్తజ్ఞ్రులు చెప్పే విషయాన్ని బట్టి కాలమనునదొక సాపేక్ష విషయమని, సంఘటనలు జరుగవని, మనమే ఆ సంఘటనలను అనుభూతి పొందుతున్నామని తెలుస్తోంది. సుప్రసిద్ధ శాస్తవ్రేత్త ఎడింగ్టన్ రుూ విషయం గురించి తన అభిప్రాయాన్నీవిధంగా చెప్పాడు. ఒక వ్యక్తి కాంతివేగంకన్నా తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు మొదట వర్తమాన కాలాన్ని తరువాత భూతకాలాన్ని అనుభవిస్తాడు. కాంతి వేగంతో సమానమైన వేగంతో ప్రయాణించేటప్పుడు, ఎల్లప్పుడు వర్తమానంలోనే ఉంటాడు. కాంతి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వ్యక్తి భవిష్యత్తును కూడా చూడగలడు. ఎడింగ్టన్ యొక్క ఈ అభిప్రాయము కల్పనకాదు. సశాస్ర్తియమైన అభిప్రాయము. మహాయోగియైన వ్యక్తి తన మనస్సును కాలము యొక్క ముందు, వెనుకలకు కూడా సారించి భూత, భవిష్యత్తులను వర్తమానంలోనే దర్శించగలడు. మూల ప్రకృతి ఎల్లప్పుడూ వ్యక్తమగుచు, వ్యాప్తి చెందుచునే ఉండును. యోగియైనవాడు, ప్రకృతి యొక్క అవస్థలతోబాటు దానినుంచిద్భవించిన కాలము యొక్క అన్నిదశలను అనుభవించగలడు. భూత, భవిష్యత్ సంఘటనలను తెలుసుకొనగలడు. దీనినే మనవారు దివ్యదృష్టి అని చెబుతారు. దీనికంతటికీ కుండిలినీ శక్తి యొక్క పరిపూర్ణమైన జాగృతస్థితియే కారణము. ఆ విధంగా కుండలిని జాగృతి పొందిన యోగి, పరిణామం యొక్క పరిపూర్ణావస్థ పొందిన ఒక మహత్తర వ్యక్తి (మహర్షి)గా భావిస్తాము. యోగశాస్త్రానికి సంబంధించిన అనేక గ్రంధాలు, కుండలినీశక్తి యొక్క సప్తయోగభూమికలను వివరించాయి. మనలోని మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార చక్రములయందు, మనస్సు ఉన్నపుడు కలిగిన, అనుభూతులు లేక శక్తులను తెలుసుకుందాం. మనస్సు ఇంద్రియముల ద్వారా బయటి విషయములయందు ఆసక్తి కలిగి, సంచరించేటప్పుడు మనలోని ప్రాణశక్తి, మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక చక్రములయందుంటుంది. అంటే జననేంద్రియముల వద్ద బొడ్డు (నాభి) వద్దగల నాడీ కేంద్రముల (చక్రముల) వద్ద వుంటుందన్నమాట. ఇటువంటి స్థితిలో మనస్సుకు ఆధ్యాత్మిక భావనలుగాని, తలంపులుగాని ఏమియు ఉండవు. మనస్సు అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములతో నిండి ఉంటుంది. మధ్యది, నాల్గవది అయిన అనాహత చక్రము వద్ద మనసు నిలిచినపుడు మనిషికి ఆధ్యాత్మిక భావనలు, తలంపులు కలుగుతాయి. అపుడు అంతటా వెలుగు దర్శనవౌతుంది. ఇది ఎంతో సాధనవల్ల కాని సాధ్యపడదు. గొప్ప ఆనందాన్ని పొందిన మనస్సు క్రింది చక్రముల వైపు మరలదు. అయిదవ కేంద్రమైన విశుద్ధి చక్రంపై మనస్సు ధ్యానమగ్నమైతే, భయము, అజ్ఞానము మొదలగు నకారాత్మక భావము లేమియును లేక మనసు పూర్తిగా భగవంతునిపై లగ్నమగును. ఇక మనస్సు ఆజ్ఞాచక్రము ధ్యానస్థితి పొందినపుడు రేయింబవళ్ళు నిరంతరాయంగా భగవద్దర్శనం కలుగుతుంది.
ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014