మెయిన్ ఫీచర్

ధ్యానం.. లక్ష్యసాధనకు మూలం ( పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ చక్రము- మానవశరీరము
ప్రతులకు
H.No. 7-8-51,Plot No. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
===============================================================
సాధకుడిలో అహంభావం (నేను అనే భావం) కొద్దిగా మిగిలే ఉంటుంది. అందువల్ల అనిర్వచనీయమైన దివ్యదర్శనం లభిస్తున్నప్పటికీ, ఆ దివ్యాత్మతో తాదాప్యత పొందలేడు.
ఇక అన్నిటికంటే పైనున్న, 7వ దైన సహస్రార చక్రం, బ్రహ్మరంధ్రంపైన మనసు తదేకంగా ధ్యాననిమగ్నమైనపుడు, అంటే కుండలిని శక్తి సహస్రారానికి చేరినపుడు, సమాధి స్థితి కలుగుతుంది. అపుడు బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మమును పొందగలుగుతాడు సాధకుడు.
ఎక్కడైనా, ఎప్పుడైనా ఒక వ్యక్తికి, విశేషమైన ప్రజ్ఞ లేక జ్ఞానం కలిగిందంటే, తత్సంబంధమైన చక్రాలలోనికి సుషుమ్న నాడి ద్వారా కుండలిని శక్తి కొద్దిగా ప్రవేశించిందని తెలుసుకోవచ్చు. కుండలిని యోగానికి చెందిన శ్రీవిద్య ఉపాసన చాలా నియనిష్ఠలతో, శుచి శుభ్రతలతో, రహస్యంగా అభ్యసించవలసి వుంటుంది. అందుచే దీనిని గుప్తవిద్య అని కూడా అంటారు. ఇది మిగతా ప్రాపంచిక విద్యలవంటిది కాదు. ఈ విద్యను గురించి కులార్ణవ తంత్రము అను గ్రంథమునందు ఈ క్రింది విధంగా చెప్పబడింది.
‘‘అన్యాస్తు సకలా విద్యః ప్రకటాగణికా ఇవ
ఇయంతు శాంభవీ విద్యా,గుప్తా కుల వధూరివ’’
అనగా లౌకిక విద్యలు, వేశ్యలవలె, బాహ్య (అంగసౌష్టవ) ప్రకటనరీతిలో ఉంటాయి. శాంభవి విద్య ఆవిధంగా కాక పవిత్రమైన గృహిణివలె ఉంటుందని అర్థము. తెలిసినా తెలియకపోయినా మనం చేసే పూజలు, దానధర్మాలు, సత్ప్రవర్తన మొదలైన సత్కర్మల ఫలితాలు, ఈకుండలినీ శక్తి వద్దకే తీసుకెళతాయి. మనిషి తనకు కలిగిన సత్ఫలితాలన్నీ తను చేసిన పూజాదికాలవల్లనే కలిగాయని భావిస్తాడు కానీ, అతడు తన ప్రార్థనవల్ల సత్కర్మలవల్ల తన మూలాధారమందు నిద్రావస్థలోనున్న రుూ మహాశక్తిని కొద్దిగా మేల్కొల్పగలిగానని అనుకోడు. కాని యోగి అయినవాడు ఆ విషయాన్ని గుర్తిస్తాడు. మహాఋషులు, యోగులు సిద్ధపురుషులు ఆ మహాశక్తిని ఏ విధంగా మేల్కొల్పి ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకొని, సాధన చేసి, శాశ్వతమైన, అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందగలిగారు. ఈ విధానమొక గొప్ప విజ్ఞాన శాస్త్రంగా భావించాలి. ప్రాణాయామాది యోగక్రియల యొక్క పరమ లక్ష్యం కూడాఇదే. ఇది భగవదానుగ్రహం, సద్గురు కృపలేనిదే సాధ్యపడదు.
యోగ ప్రక్రియలో ధ్యానమత్యంత ముఖ్యాంశమని మనకు తెలుసు. ఇటీవలి కాలంలో పాశ్చాత్య పరిశోధకులు భారతీయమైన ‘యోగా’కు ఆకర్షితులై ‘్ధ్యనం’ గురించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. వాటిలో కొన్ని పరిశీలిద్దాం. ఇతఃపూర్వం యవ్వన దశ తరువాత బుద్ధి స్థిరపడిపోతుందని ఇక మారదని వారి నమ్మకం.
కాని ఇటీవలి అమెరికాలోని విస్కాన్సిస్ విశ్వవిద్యాలయంలో నరాల చికిత్సకు సంబంధించిన శాస్తవ్రేత్త రిచర్డ్ డేవిడ్‌సన్ తన పరిశోధనల ద్వారా నిర్థారించినదేమంటే ధ్యానంవల్ల బుద్ధిని ప్రచోదనం చేసి క్రియాశీలత్వాన్ని ప్రభావితం చేయవలచ్చని తేల్చి చెప్పాడు. అంతేకాదు ధ్యానంవల్ల వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు, బుద్ధి మాంద్యాన్ని నియంత్రించవచ్చునని తేలింది.
2000 సంవత్సరంలో అమెరికాలో జరిపిన ఒక పరిశోధన ద్వారా నాలుగు గంటల సుఖ నిద్ర కంటే ఒక్క గంటసేపు చేసే ధ్యానంవల్ల ఎక్కువ విశ్రాంతి మానసిక ప్రశాంతత తలపిస్తుందని తేలింది. ధ్యానం చేసే వారిలో లక్ష్య సాధన ఎక్కువగా ఉంటుందని తేల్చారు. 2008 సంవత్సరంలో డాక్టర్ రాండీఝస్మన్ తన పరిశోధనల ద్వారా ధ్యానంవల్ల రక్తపోటు నియంత్రించవచ్చన్నాడు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వారు ధ్యానం ద్వారా వృద్ధాప్యంలో వార్థక్య ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని తేల్చారు. ‘వేక్ ఫారెస్టు బాప్టిస్టు’ విశ్వవిద్యాలయంవారు ధ్యానంవల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిర్థారించారు.
యోగములేని జ్ఞానము జ్ఞానము లేని యోగము సిద్ధింపజాలవు. కావున సాధకుడు శరీరావయముల బాధింపని సుఖాసనమున కూర్చుండి మనసును కేంద్రీకరించి వౌనముగా ప్రణవధ్యానము చేయుచు మూలాధారమునందు ప్రాణమును బంధించిన యెడల కుండిలిని మేల్కొనును. అట్లు మేల్కనిన కుండలిని శక్తి త్రైలోక్య మోహన చక్రము నుండి సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథిని పిదప రుద్రగ్రంథిని భేదించి ప్రాణశక్తిని కుంభించుటచే సూర్యభేదనము, ఉజ్జాయిని, భస్త్ర, శీతలిని క్రియలచే కైవల్య ప్రాప్తికి కారణమగును. ఇడాపింగళనాడుల ద్వారా, మార్చి మార్చి పూరక, కుంభక, రేచక, ప్రాణాయామము చేయుటే, ఉదరమునందలి క్రిమి దోషములు, కంఠగత కఫ దోషములు ధాతు సంబంధ దోషములను హరించును.
ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014