మెయన్ ఫీచర్

రోత పుట్టిస్తున్న లౌకికవాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనారోగ్యం పాలైనప్పటికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ( ఏ వ్యాధితో ఆమె తరచూ అమెరికన్ ఆస్పత్రులకు విహారయాత్రలు చేస్తున్నారో ఎవరికీ తెలియదు) విపక్ష పార్టీలతో ‘లౌకిక కూ టమి’ ఏర్పాటు చేసి రాష్టప్రతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆస్పత్రిలోనే ఉంటూ ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ)కి ఫోన్ చేసి- రాష్టప్రతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం గురించి మాట్లాడారు. లౌకిక నేతలు, లౌకిక పార్టీలను ఏకతాటిపైకి తేవాలనుకొంటున్న సోనియా రాష్టప్రతి ఎన్నికను ఒక అవకాశంగా భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ను ‘ఇస్లామీకరణ’ చేస్తూ, బంగ్లాదేశ్ నుంచి దిగుమతవుతున్న జిహాదిస్టులకు అండగా నిలుస్తున్న మమతా బెనర్జీ- సోనియా వద్ద ఉన్న ‘లౌకికవాదుల జాబితా’లో అగ్రభాగాన ఉన్నారు. ‘దీదీ’ వద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలోనే ఉన్నందున రాష్టప్రతి ఎన్నికల్లో ఆమె అవసరం ఉందన్నది సోనియా భావన. కర్నాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య కంటే మమత శిబిరంలో ఉన్న ఎంపీల సంఖ్య ఎక్కువే!
ఇక, ‘దీదీ’ ఎంత లౌకికవాదో మనం విశే్లషిద్దాం. టిప్పు సుల్తాన్ మసీదుకు చెందిన షాహీ ఇమామ్ ఆమె బలమైన అనుచరుల్లో ఒకరు. షాహీ ఇమామ్ భావజాలానికి సమానంగానే ఆమె తన మనోగతాన్ని ప్రదర్శిస్తుంటారు. జనాల్ని ప్రేరేపించే ‘వాహబీ నేత’ తరచూ ‘దీదీ’తో వేదిక పంచుకుంటూ, ఆమెకు అనధికార సలహాదారుగా గుర్తింపు పొందారు. వాహనాలపై ‘ఎర్రబుగ్గ’లను తొలగించాలని ఇటీవల కేంద్రం ఆదేశించినా, పాత పద్ధతినే కొనసాగించాలని షాహీ ఇమామ్‌కు మమతా బెనర్జీ సలహా ఇచ్చారు. వాహనంపై ‘ఎర్రబుగ్గ’ను వాడే హక్కును బ్రిటిష్ వారు తనకు ఇచ్చారని, ‘బ్రిటిష్ కానుక’ను అనుభవించకుండా చేసే అధికారం కేంద్రానికి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రభుత్వంపై ఇమామ్ ఇలా ‘పట్టు’ సాధించడంతో రాష్ట్రంలో జిహాదీలు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో ‘స్వల్ప సంఖ్యాకులు’గా మారబోయే హిందువులకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. ‘విద్యా భారతి’ స్కూళ్లను మూసివేయించిన బెంగాల్ ప్రభుత్వం ముస్లింలపై ప్రేమతో మదరసాలకు 2,500 కోట్ల రూపాయలను కేటాయించింది. జాతీయత, భారతీయ సంస్కృతిని బోధించే సుమారు 350 ‘విద్యా భా రతి’ పాఠశాలల్లో 60 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత విలువలను బోధించే ఈ స్కూళ్లను ‘లౌకికవాది’ మమతా బెనర్జీ అసహ్యించుకొంటారు. విదేశాల్లో ని వాహబీ సంస్థల నుంచి నిధులను పొందే సుమారు రెండు వేల అనధికార మదరసాలు బెంగాల్‌లో నిర్విఘ్నంగా నడుస్తున్నాయి. ఈ మదరసాలలో పిల్లలకు ఏం చెబుతుంటారు? ఇస్లాంపై విశ్వాసం లేని వారిని నిర్మూలించాలని, విగ్రహారాధకుల కుత్తకలను కత్తిరించాలని బోధిస్తుంటారు. ముస్లింలు కానివారు ‘ఇస్లాం’లోకి మారాలి లేదా మరణించే వరకూ హింసను భరించాలి. ముస్లిం తీవ్రవాదులు ఎంత వరకూ తెగిస్తున్నారంటే- ఓ విద్యార్థుల హాస్టల్‌లో బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహ్నాన్ విగ్రహాన్ని తొలగించాలని హుకుం జారీ చేశారు! పాకిస్తాన్ విభజనకు ఈయనే కారకుడని ఉగ్రవాదులు ఆగ్రహం ప్రకటిస్తుంటారు.
‘హుజి’, ‘జెఎంబి’ తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన జిహాదీలు మన సరిహద్దుల్లో ప్రవేశిస్తున్నారని బంగ్లాదేశ్ హెచ్చరిస్తోంది. పశ్చిమ బెంగాల్ తమ పాలిట స్వర్గ్ధామం అని జిహాదీలు భావిస్తున్నందున, ఆ రాష్ట్రంలో వారిని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా బంగ్లాదేశ్ సూచిస్తోంది. 2015లో కంటే 2016లో భారత సరిహద్దుల్లో జిహాదీల చొరబాట్లు పెరిగాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత హోం మంత్రిత్వ శాఖకు పంపిన నివేదికలో తెలిపింది. అయితే, దీదీ ఆధ్వర్యంలోని బెంగాల్ ప్రభుత్వం మాత్రం ఈ వాస్తవాలను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. 2014లో 800 చొరబాట్లు, 2015లో 659 చొరబాట్లు మాత్రమే జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. హిందూ గ్రామాలపై దాడులు, హింస జరగకుండా దీదీ ప్రభుత్వం భరోసా ఇచ్చే పరిస్థితి లేదన్నది నిజం. దుర్గా పూజలను అడ్డుకోవడం షరామామూలుగా మారింది. ‘వసంత పంచమి’ నాడు అక్షరాభ్యా సం చేసే చిన్నారులపైనా జిహాదీలు దాడులు చేయడం అ త్యంత అనాగరికం. జిహాదీలకు గట్టి మద్దతుదారుగా నిలుస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి త్వ రలో సోనియా ఏర్పాటు చేసే ‘లౌకిక కూటమి’లో కీలకనేత అవుతారట! రాహుల్ గాంధీ ‘ప్రధాని రేసు’లో ఉంటారని కలలు కనడానికి సైతం కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేనందున- 2019లో ‘దీదీ’ ప్రధానమంత్రి అభ్యర్థి అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు!
సోనియా జాబితాలో లౌకికవాదుల పేర్లకు కరవే లేదు. ఆర్‌జెడి నేత లాలూ, యుపి యువకిశోరం అఖిలేశ్ యాదవ్, వైభవం కోల్పోయిన మాయావతి, బిహార్ సిఎం నితీశ్ కుమార్, అసలైన లౌకికవాదులను నడిపే వామపక్ష నేత సీతారాం ఏచూరి.. ఈ జాబితాకు అంతేలేదు.. పశుదాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష పడిన లాలూ తన హయాంలో ‘ఆటవిక రాజ్యాన్ని’ ప్రజలకు చవిచూపాడు. తన హయాంలో అవినీతి, హత్యలు, హింస, ఆటవిక పాలన విశృంఖలంగా కొనసాగినా, సయ్యద్ షాహబుద్దీన్ వంటి హంతకులతో సంబంధాలున్నా- సోనియా దృష్టిలో లాలూ ఓ నిజమైన లౌకికవాది! లౌకిక కూటమికి లాలూ మద్దతు కావాలన్నది కాంగ్రెస్ అధినేత్రి ఆకాంక్ష. మైనారిటీలను బుజ్జగించడం ఒక్కటే- ‘లౌకికవాది’ అన్పించుకోవడానికి లాలూకు ఉన్న అర్హత!
మరో వీర లౌకికవాది- అఖిలేశ్ యాదవ్. యుపిలో ముస్లిం జనాభాకు తనకు ఇష్టమైన రీతిలో ‘అపరిమితంగా’ కాసుల వర్షం కురిపించిన ఈ యువనేత మెజారిటీ మతస్థులకు మాత్రం న్యాయమైన కేటాయింపులు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇక ఆయన ఆలోచనా విధానం ఏమిటో చూద్దాం.. గుజరాత్‌లో సైనికదళాలకు సంబంధించి అమరవీరులే లేరన్నది ఆయన వాదన. యుపి, బిహార్, ఎంపి, దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది అమరవీరులున్నారన్నది ఆయన సిద్ధాంతం. ఆయన వాదనకు రెండు కారణాలు కనిపిస్తాయి. ఒ కటి- గుజరాతీయేతర సె నికులపైనే పాకిస్తాన్ సైన్యం గురిపెడుతుంది. యుపి, బి హార్ తదితర రాష్ట్రాలకు చెందిన సైనికులనే సరిహద్దుల్లో నియమించాలని ఆర్మీ అధిపతిని ప్రధాని మోదీ ఆదేశించారన్నది అఖిలేశ్ రెండో ఆరోపణ. ఈయన సోనియా దృష్టిలో లౌకికవాది. ఆమె కలగంటున్న లౌకిక కూటమికి అఖిలేశ్ అవసరమే. బిఎస్పీ అధినేత్రి మాయావతి గు రించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. యుపి అసెంబ్లీ ఎన్నికల్లో 403 అసెంబ్లీ స్థానాల్లో వందమంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టి, ఆ వర్గం ఓట్లన్నీ తనకేనని ఆశపడిన ఆమెకు చివరకు భంగపాటు మిగిలింది. ముస్లింలే తన బలమని భావించింది. గనుక ఆమె కూడా ఓ లౌకికవాది అని మనం ఒప్పుకొని తీరాలి.
2014 ఎన్నికల వరకూ భాజపాతో చెలిమి చేసిన ప్రస్తుత బిహార్ సిఎం, జెడి(యు) పార్టీ నేత నితీశ్ కుమార్ కూడా లౌకికవాదానికి ప్రతినిధే. మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో భాజపాకు దూరమైన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జెడి అధినేత లాలూతో పొత్తు పెట్టుకుని సిఎం పీఠాన్ని అధిష్ఠించాడు. జిహాదీలు బిహార్‌పై గురి పెట్టడంతో- ముస్లిం ఓట్లు మరొకరికి దక్కకూడదని తన పంథా మార్చుకున్న నితీశ్ ఇప్పుడు కల్తీలేని లౌకికవాది! మోదీని వ్యతిరేకిస్తున్న ఆయన సహజంగానే ‘లౌకిక కూటమి’లో భాగస్వామి కావాల్సిందే! తాము ఎప్పుడూ లౌకికవాదులమే అని తాము ధరించే చొక్కాలపై ఆధారాలు చూపించుకునే వామపక్ష నేతలు కేరళలో ముస్లింల కోసం ఏకంగా ‘మలప్పురం జిల్లా’ను ఏర్పాటు చేశారు. ‘లెఫ్ట్’ నేతల ‘ట్రాక్ రికార్డు’ నిత్యం హిందూ వ్యతిరేకత, ముస్లిం అనుకూలతగానే ఉంటుంది. వీరు సోనియాకు సహజ మిత్రులు! వీరు గాక దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, జైరామ్ రమేష్ వంటి వందిమాగధులు సోనియాకు ఇరువైపులా ఉండనే ఉంటారు.
ఇక్కడ తర్కం చాలా సులువైనదే.. మోదీ వెన్నంటి ఉండేవారంతా ‘మతోన్మాదులు’.. ఆయనను వ్యతిరేకించేవారంతా ‘లౌకికవాదులు’! అయ్యో.. యుపి ఎన్నికల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదే..! *

ఎస్‌ఆర్‌ రామానుజం, సెల్ : 80083 22206