ఆంధ్రప్రదేశ్‌

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత అజాద్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: కొయ్యూరు మండలం మురిపాకల వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ ముఖ్యనేత అజాద్ మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. మావోలు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మరణించిన సంగతి తెలిసిందే. గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న అజాద్‌పై గతంలోనే పోలీసులు నాలుగు లక్షల రివార్డు ప్రకటించారు. మృతుల్లో మిగతా ఇద్దరిని ఇంకా గుర్తించాల్సి ఉంది. మృతదేహాలకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతుంది.