ఆంధ్రప్రదేశ్‌

చూచికాపీలను అడ్డుకున్నారని ఆందోళన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: పరీక్షా కేంద్రంలో చూచిరాతను అడ్డుకోవడం అన్యాయమంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో పదో తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షల సందర్భంగా బుధవారం ఈ ఘటన జరిగింది. పరీక్షా కేంద్రంలో కొందరు విద్యార్థులు చూచికాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్లు పట్టుకుని వారిని బయటకు పంపారు. దీంతో చాలామంది విద్యార్థులు పరీక్షా కేంద్రం బయట ఆందోళనకు దిగారు. చూచిరాతలు సజావుగా జరిగేలా కొందరు మధ్యవర్తులు తమ నుంచి డబ్బులు తీసుకున్నారని, పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్లు అందుకు విరుద్ధంగా వ్యవహరించి తమను బయటకు పంపేశారని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.