రాష్ట్రీయం
అఖిలపక్ష సమావేశం ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 27 March 2018
అమరావతి: ప్రత్యేకహోదా సాధన, కేంద్ర సాయంపై చర్చించేందుకు అఖిల పక్ష, , ఇతర సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సమావేశమైంది. సచివాలయంలోని బ్లాక్-1లో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదుగురు మంత్రులు హజరయ్యారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంక్రటావు, మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్ల రామయ్య హజరయ్యారు. లోక్సత్తా పార్టీ నుంచి భీశెట్టి బాబ్జీ, భాను ప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు హాజరయ్యారు. మరోవైపు ఈ సమావేశానికి హాజరుకాకూడదని వైకాపా, జనసేన, భాజపా నిర్ణయించాయి.