ఆంధ్రప్రదేశ్
పోలీసుల కళ్లుగప్పి మోసగాడు పరార్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 30 June 2016
ఒంగోలు: తాను పనిచేస్తున్న లాడ్జీలో 80 వేల రూపాయలు చోరీ చేయడమే గాక, మిర్చి రైతులకు రెండు కోట్ల రూపాయలు బకాయి పడిన వంచకుడు పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. లాడ్జీలో నగదు చోరీకి సంబంధించి పర్చూరు పోలీసులు ప్రభాకర శర్మ అనే నిందితుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. రెండు కోట్ల రూపాయల మేరకు మిరపకాయలు కొనుగోలు చేసి రైతులకు బకాయిపడినట్టు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నిందితుడు శర్మ పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.