రాష్ట్రీయం
మనం చేసేది లాలూచీ రాజకీయాలు కాదు: చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 April 2018
అమరావతి: ఢిల్లీలో మనం చేసేది లాలూచీ రాజకీయాలు కాదని, ప్రజలకు ఉపయోగపడే రాజకీయం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారంనాడు ఆయన తెలుగుదేశం ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు వెల్లడించారు. ఎన్నికలంటే వైకాపాకు భయమని, అందుకే పార్లమెంట్ చివరి రోజున రాజీనామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.