ఆంధ్రప్రదేశ్‌

వైద్యుల డుమ్మాపై మంత్రి మృణాళిని ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: ప్రభుత్వ ఆస్పత్రిలో సగం మంది వైద్యులు కూడా విధులకు రాకపోవడంపై మంత్రి మృణాళిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి మహారాజా ప్రభుత్వ ఆస్పత్రిని ఆమె శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ 36 మంది వైద్యులుండగా, 12 మంది మాత్రమే విధుల్లో కనిపించడంపై మంత్రి విస్మయం చెందారు. మంత్రి వచ్చారని తెలిసి కొందరు వైద్యులు ఆస్పత్రి వెనుక ద్వారం నుంచి నెమ్మదిగా లోనికి ప్రవేశించారు. భారీగా జీతాలు తీసుకుంటున్న వైద్యులు విధులకు డుమ్మా కొట్టడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.