రాష్ట్రీయం

నేడు ప్రత్యేక విమానంలో అహ్మద్ భౌతిక కాయం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: సియాచిన్ ప్రమాదంలో అమరుడైన వీర సైనికుడు ముస్తాఖ్ అహ్మద్ భౌతిక కాయం సోమవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి రానుంది. ప్రత్యేక విమానంలో ముస్తాఖ్ భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు తీసుకురానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేట విమానాశ్రయం వద్ద అమరుడు మస్తాఖ్ భౌతిక కాయానికి పలువురు అధికారులు నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన స్వగ్రామమైన కర్నూలు జిల్లా నంద్యాలకు భౌతిక కాయానిన తరలిస్తారు. సైనిక అధికార లాంఛనాలతో ముస్తాఖ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయి.