క్రైమ్/లీగల్

యాదాద్రిపై ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, అక్టోబర్ 2: యాదాద్రిపై మంగళవారం ప్రేమజంట ఆత్మహత్య యత్నం చేసింది. హైద్రాబాద్ ఆల్వాల్‌కు చెందిన ఎం.మనీశ్(20), పీ.బీ.అక్షయ(18)లు మంగళవారం శ్రీ చక్ర భవనం మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య యత్నం చేశారు. వారిరువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని భువనగిరి ఆసుపత్రికి తరలించగా వారిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మనీశ్‌కు నడుములు విరిగిపోగా, అక్షయ కోమాలోకి వెళ్లిందని, ప్రేమజంట పూర్తి వివరాలు తెలియరాలేదని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక సీఐ నర్సింగ్‌రావు తెలిపారు. మనీశ్, అక్షయలపై ఈనెల 28న అల్వాల్ పోలీస్ స్టేషన్‌లపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు జరిగిందని తెలిపారు. తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసి కొండపైకి వెళ్లారని, తల్లిదండ్రులను చూసిన మనీశ్, అక్షయ్‌లు భవనంపై నుండి దూకారని సిఐ తెలిపారు.

కట్టుకున్నోడే కడతెర్చాడు..
మర్రిగూడ, అక్టోబర్ 2: జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త, తన భార్యను ఉరేసి హత్య చేశాడు. మంగళవారం కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎరుగండ్లపల్లి గ్రామానికి చెందిన పాలకుర్ల జంగయ్య 2010లో చింతపల్లి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన శ్రీలత (25) తో వివాహమైంది. దంపతులిద్దరూ బతుకుదెరువు కోసం హైద్రబాద్‌లోని హస్తినపురంలో వుంటూ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సోవవారం మధ్నాహం భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవ తలెత్తి హత్యకు దారి తీసింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నిందితుడి స్వగ్రామానికి తీసుకొచ్చి ఆమె బంధువులు అందోళనకు దిగారు. మృతురాలికి 7 సంవత్సరాల కుమారుడు, 4 సంవత్సరాల పాప ఉన్నారు. ఆందోళన తీవ్రమవవడంతో సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ మంజునాథ్ రెడ్డి, గ్రామానికి చేరుకొని బందోబస్తు నిర్వహించారు. మృతురాలు తల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు హైద్రబాద్‌లోని మీర్‌పేటలో కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.