రాష్ట్రీయం
ఉత్తరాఖండ్ వ్యవహారంపై రాజ్యసభలో కాంగ్రెస్ నోటీసు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 April 2016
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఉత్తరాఖండ్ వ్యవహారం పార్లమెంట్ బడ్జెట్ రెండోదఫా సమావేశాలలో మోదీ సర్కారుపై విరుచుకుపడటానికి కాంగ్రెస్కు ప్రధానాస్త్రంగా మారింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచిన మోదీ సర్కారు తీరును ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి గురువారం నోటీసు ఇచ్చింది. హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ నిబంధనావళిలోని రూల్ 267 పరిధిలో అన్ని అంశాలను పక్కన పెట్టి ఈ తీర్మానాన్ని చేపట్టాలని అన్సారీని కాంగ్రెస్ కోరింది.