రాష్ట్రీయం

అన్నీ చర్చించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో జరపనున్న చర్చల్లో వివాదాస్పద డోక్లామ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా నిర్మిస్తోన్న ఆర్థిక కారిడార్ అంశాలు తప్పక చర్చించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ సూచించారు. శుక్రవారం ఈమేరకు ట్వీట్ చేస్తూ, ‘ప్రియమైన మోదీజీ, మీ ‘నో అజెండా’ చైనా యాత్రను లైవ్ ఫీడ్‌లో ఒకసారి చూసుకోండి. మీలో కొంత ఆందోళన కనిపిస్తోంది. వివాదాస్పద డోక్లాం, సీపీఈసీ అంశాలపై చైనాతో మీరు మాట్లాడాలని భారతదేశం కోరుకుంటోంది. ఆ చర్చలకు మా మద్దతు ఉంటుంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో అనధికార చర్చల కోసం మోదీ వుహాన్ వెళ్లటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.