ఆంధ్రప్రదేశ్
ఎవరెస్ట్ను అధిరోహించిన నవ్యాంధ్ర మహిళ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 May 2016
విజయవాడ: నవ్యాంధ్ర నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు మహిళగా నీలిమ చరిత్ర సృష్టించింది. పర్వతారోహణకు ఇటీవల బయలుదేరిన ఆమె మంగళవారం ఉదయం నాటికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు ఇక్కడికి సమాచారం అందింది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంకు చెందిన నీలిమ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటోంది. నవ్యాంధ్ర నుంచి ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించినందుకు నీలిమను ఎపి సిఎం చంద్రబాబు అభినందించారు. ఆమె సాహసం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన ప్రశంసించారు. పట్టుదలతో కృషి చేస్తే ఏదీ అసాధ్యం కాదని ఆమె నిరూపించిందన్నారు.