క్రైమ్/లీగల్

కసాయి తండ్రి చిన్నారిని చిదిమేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లూరు, మార్చి 12: కుటుంబ కలహాలతో విచక్షణ కోల్పోయిన ఓ తండ్రి కన్నకూతురు అన్న కనికరం లేకుండా చిన్నారిని చిదిమేశాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని ఇందుపూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. అల్లూరు మండలం నార్తుఆములూరు గిరిజన కాలనీకి చెందిన కిరంశెట్టి చంద్ర, సంజీవినికి కలిగిన సంతానం చందన (3). వీరు మండలంలోని ఇందుపూరు గ్రామంలో పశువుల కాపరులుగా ఉండేవారు. నిత్యం భార్యాభర్తలు గొడవ పడుతుండేవారని, ఈక్రమంలో భర్త ఘర్షణకు దిగడంతో భార్య అలిగి ఆమె స్వగ్రామమైన నార్తు ఆములూరికి వెళ్లిపోయింది. దీంతో అతడు చిన్నారి చందనకు గుళికలు తినిపించగా ఆమె చనిపోయింది. ఈ పరిస్థితుల్లో అతడు కూడా గుళికలు తిని అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో స్థానికులు అతడిని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు.