Others

నాకు నచ్చిన చిత్రం.. ‘వీరకంకణం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోడరన్ థియేటర్స్ నిర్మించిన వినూత్న జానపద చిత్రం ‘వీర కంకణం’. 1957లో ఈ చిత్రం విడుదలైంది. దీనికి మాతృక తమిళ జానపద చిత్రం ‘మంత్రి కుమారి’. జానపదాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చిత్రం ‘వీర కంకణం’. అంతవరకూ వచ్చిన జానపద చిత్రాల్లో మాంత్రికులు, మంత్రతంత్రాలు, దేవకన్యలు తప్పనిసరిగా ఉండేవారు. ‘అల్లావుద్దీన్ అద్భుతదీపం’ వరకు ఇదే పరిస్థితి. రాజరిక వ్యవస్థలో మతం పేరుతో జరిగే దోపిడీ, స్వార్థపరులైన అధికారులవల్ల సామాన్య జనం పడే అవస్థలు, దేశంకోసం ప్రాణాలర్పించే వీరులు, వీర వనితలు ముఖ్య కథాంశాలుగా అల్లుకున్నది ఈ చిత్రం. ఈ వినూత్న ధోరణిలో వచ్చిన చిత్రాల్లో ఇది మొట్టమొదటిది. అందుకే ఇది నాకు బాగా నచ్చిన చిత్రం.
వ్యక్తిగత ప్రయోజనాలకంటే దేశ క్షేమమే మిన్న అనేది ఈ చిత్రంలో సందేశం. దేశంకోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే సేనాధిపతి వీరమోహన్‌గా ఎన్టీ రామారావు, రాకుమారిగా కృష్ణకుమారి, మరో కీలకమైన పాత్రలో మంత్రి కుమారిగా జమున, అమాయకుడైన రాజును, ప్రజలను తన మాయమాటలతో మభ్యపెట్టే రాజగురువుగా గుమ్మడి, స్వార్థపరుడు, నయవంచకుడు అయిన అతని కొడుకు చంద్రసేనుడుగా జగ్గయ్య అత్యద్భుతంగా నటించారు.
ఈ చిత్రానికి ఆరుద్ర ఆణిముత్యాల్లాంటి సంభాషణలు సమకూర్చారు. కీలక సన్నివేశాల్లో ఆయన వ్రాసిన డైలాగులు అద్భుతంగా పేలాయి. ఈ చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తి సమకూర్చిన సంగీతం చిత్రానికి కొండంత బలాన్ని సమకూర్చింది. ‘కట్టండి వీరకంకణం/ పట్టండి ధర్మఖడ్గమే/ దేశభక్తి చూపుటకై’ అనే బృందగానాన్ని ఎన్టీఆర్, జమునలపై చిత్రీకరించారు. ఎఎమ్ రాజా, జిక్కి బృందం పాడిన ఈ పాట ఆద్యంతం ఉద్వేగ భరితంగా ఉంటుంది. మతం పేరిట, దేవుడి పేరిట జనాన్ని వంచించడం, అధికారాన్ని హస్తగతం చేసుకోవడం దేశ చరిత్రలో కొత్త విషయమేమీ కాదు. కానీ ఆ జనం చైతన్యవంతులైనపుడు ఏం జరుగుతుంది? అదే ఈ చిత్రంలో క్లైమాక్స్. అన్ని అనర్థాలకు మూలం రాజగురువని గ్రహించిన జనం ఆగ్రహంతో అతన్ని ఊరి పొలిమేరల వరకు తరిమికొడతారు. జనాగ్రహానికి గురైన రాజగురువు మరణిస్తాడు. రాజ్యక్షేమం కోసం దుష్టుడైన భర్తను సైతం అంతమొందించడానికి వెనుకాడని వీరనారి మంత్రి కుమారి పాత్రకు జమున జీవంపోశారు. ఈ కథాంశం స్ఫూర్తితో తర్వాత మరికొన్ని జానపద చిత్రాలు వచ్చాయి. కానీ ‘వీరకంకణం’ చిత్రానికున్న వైవిధ్యం మరిదేనికీ లేదు.

-పి గణేశ్ శంకర్ విద్యార్థి, రాజమహేంద్రవరం