రాష్ట్రీయం
అమిత్షా లేఖపై స్పందించాల్సిన అవసరం లేదు:పవన్ కల్యాణ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 26 March 2018
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై తాను స్పందించాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులతో సుదీర్ఘ సమావేశం తరువాత విలేకర్లతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమకు బీజేపీ, టీడీపీలపై విశ్వాసం పోయిందని అన్నారు. ఏపీ ప్రజలకు వౌలిక వసతులు కల్పించటంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. యువతకు ఉద్యోగావకాశాలు లేవు. సరైన విద్యావిధానం లేదు. వైద్య సదుపాయాలు లేవు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. డబ్బులు లేవంటూనే పుష్కరాలకు విపరీతంగా ఖర్చుపెట్టారని విమర్శించారు.