రాష్ట్రీయం

ప్రజాప్రభుత్వం రావాలి.. వలసలు ఆగాలి:పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రావాలి. వలసలు ఆగాల్సిన అవసరం ఏర్పడిందని జనసేన నేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన విజయనగరం జిల్లా భోగాపురంలో శనివారంనాడు ప్రజాపోరాట యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పరివారం అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. నలభై ఏళ్ల అనుభవం ఇసుక అవినీతితో బయటపడిందని ఎద్దేవాచేశారు. 2014 ఎన్నికల్లో 75 స్థానాల్లో పోటీచేద్దామని అనుకున్నానని, అనుభవం ఉందనే కారణంతో తెలుగుదేశంకు మద్దతు ఇచ్చానని తెలిపారు. నేను ప్రజలను రెచ్చగొట్టేవాడిని కాను, నిజాలు మాట్లాడేవాడినని అన్నారు. పచ్చని భూములను అభివృద్ధి పేరిట తీసుకుని కబ్జాలు చేస్తున్నారని, ఎమ్మెల్యేలకు అన్ని వేల ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.