రాష్ట్రీయం

అక్బరుద్దీన్‌పై కేసుల దర్యాప్తును ముగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టులో పిల్ దాఖలు

హైదరాబాద్, జనవరి 2: మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసులలో త్వరితగతిన దర్యాప్తు చేసే విధంగా పోలీసు శాఖను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్ దాఖలైంది.
2013లో నిర్మల్, నిజామాబాద్ పోలీసు స్టేషన్లలో అక్బరుద్దీన్‌పై కేసులు నమోదయ్యాయని పిల్ దాఖలు చేసిన సయ్యద్ తరాక్ ఖాద్రి కోర్టుకు తెలిపారు. ఈ రెండు పోలీసు స్టేషన్లలో 2012 డిసెంబర్ 8, 22 తేదీల్లో కేసులు నమోదైన సంగతి విదితమే. ఈ కేసులను పోలీసులు సుమోటోగా స్వీకరించారు. అనంతరం ఈ కేసుల్లో నిర్మల్ పోలీసులు అక్బరుద్దీన్‌ను అరెస్టు చేసి ఆదిలాబాద్ జైలులో ఉంచారు. అనంతరం 2013 ఫిబ్రవరి 16వ తేదీన అక్బరుద్దీన్‌ను బెయిల్‌పై విడుదల చేశారు. పోలీసులు ఈ కేసులను త్వరితగతిన విచారించడంలేదని పిటిషనర్ పిల్‌లో పేర్కొన్నారు.