ఆంధ్రప్రదేశ్
వచ్చే నెల నుంచి వాల్పోస్టర్లపై నిషేధం: చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 August 2016
విజయవాడ: ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎపిలో వాల్పోస్టర్లను నిషేధించనున్నట్లు సిఎం చంద్రబాబు గురువారం మీడియాకు తెలిపారు. గోడలపై పోస్టర్లు అంటించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థలు, విద్యార్థులతో కలిసి పోస్టర్ల నిషేధానికి కృషి చేసేలా ఆదేశాలు జారీచేస్తామన్నారు. పట్టణాల్లో పోస్టర్ల కోసం విడిగా స్థలాలను కేటాయిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేయవచ్చని కృష్ణా పుష్కరాల ద్వారా నిరూపించామన్నారు. ప్రభుత్వ విధానాల అమలులో యువశక్తిని భాగస్వామ్యం చేస్తామన్నారు.