క్రైమ్/లీగల్

సముద్రంలో మునిగి బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపట్నం, నవంబర్ 10 : కొత్తపట్నం సముద్రంలో మునిగి బాలుడు మృతి చెందిన సంఘటన కె పల్లిపాలెం బీచ్ వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు శ్రీనగర్ కాలనీకి చెందిన బద్వేల్ జయంత్ (14) అనే బాలుడు సెయింట్ జేవియర్స్ స్కూల్‌లో చదువుతున్నాడు. బాలుడు తన స్నేహితులతో కలిసి శనివారం సముద్ర స్నానానికి వచ్చారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సముద్రంలో మునుగుతుండగా అలల తాకిడికి సముద్రంలో మునిగి పోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. బాలుడు మృతదేహం నీటి పై తేలాడుతుండగా అక్కడున్న జాలర్ల సహాయంతో ఒడ్డుకు తరలించారు. బాలుడు తండ్రి రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.