చిత్తూరు

ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
మదనపల్లె, డిసెంబర్ 27: పెళ్లి అయిన వివాహితతో ఓ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత నాలుగురోజుల క్రితం పుట్టింటికెళ్లిన వివాహిత చివరకు శవమై కన్పించింది. అదేరోజు నుంచి ప్రియుడు సైతం కన్పించకపోవడంతో వివాహిత భర్త, ఆమె తల్లిదండ్రులు ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లె రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బొమ్మనచెరువు పంచాయతీ బైరాసిపెంటకు చెందిన గంగులప్పతో చౌడేపల్లెకు చెందిన భాగ్యమ్మతో 10ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లల సంతానం. చౌడేపల్లెకు చెందిన రెడ్డిశేఖర్‌కు బైరాసిపెంటకు చెందిన యువతితో వివాహమైంది. రెడ్డిశేఖర్‌తో భాగ్యమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈక్రమంలో ఇటీవల ప్రియుడికి మగపిల్లవాడు జన్మించడం.. చూసేందుకు చౌడేపల్లెలోని అమ్మగారింటికెళ్లింది. చౌడేపల్లెలోనే ఉన్న ప్రియుడితో కలిసి స్వగ్రామం బైరాసిపెంటకు బయలుదేరారు. గత నాలుగురోజులుగా ఇద్దరు బైరాసిపెంటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త గంగులప్ప చౌడేపల్లెలోని అత్తమామలకు ఫోన్‌చేశారు. దీంతో అనుమానం వచ్చిన భర్త స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం గ్రామశివారు నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్థులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా రాతిగుండ్లు నడుమ భాగ్యమ్మ రక్తపుమడుగులో శవమై కన్పించింది. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉంది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం, విఆర్‌ఓ శవపంచనామా నిర్వహించారు. భర్త ఫిర్యాదు మేరకు హత్యకేసుగా నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.