ఆంధ్రప్రదేశ్‌

భారీ వర్షంతో ఆగిన రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల-రెడ్డిగూడెం మధ్యం రైల్వే ట్రాక్ భారీ వర్షానికి కొట్టుకుపోయింది. రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రైల్వే ట్రాక్ మీద వరద నీరు చేరుకుంది. దీంతో గురువారం పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్ వెళ్లే అజంతా ఎక్స్‌ప్రెస్‌ను నడికుడు మీదుగా నడుపుతున్నారు. గుంటూరు మీదుగా నడవాల్సిన రైళ్లను దారి మళ్లించారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను నడికుడిలో, మాచర్ల ఎక్స్‌ప్రెస్‌ను పిడిగురాళ్లలో, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను మిర్యాలగూడలో, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను బెల్లంకొండలో నిలిపివేశారు.