ఆంధ్రప్రదేశ్
టిడిపిని భ్రష్టుపట్టిస్తున్న లోకేశ్: రోజా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 February 2016
కాకినాడ: చంద్రబాబు కుమారుడు లోకేశ్ కారణంగా తెలంగాణలో టిడిపి ఉనికిని కోల్పోయిందని, భవిష్యత్లో ఎ.పి.లోనూ ఆ పార్టీకి అదే గతి పడుతుందని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమె గురువారం అన్నవరం ఆలయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టిడిపి నేతలు ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. కేసులు పెట్టి వేధిస్తున్నందువల్లనే కొందరు వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్తున్నారని ఆమె ఆరోపించారు.