రుచి

రకరకాల వడియాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారి శుభకార్యాల్లో అప్పడాలు, వడియాలు, ఒరుగులు, ఊరగాయలు.. తప్పనిసరి. మార్చి నెల వచ్చేసింది. ఎండలు ముదురుతున్నాయి. సంవత్సరానికంతటికీ సరిపడే వడియాలు, ఒరుగులు పెట్టడానికి ఆడవారు సిద్ధమైపోతున్నారు. మరోవైపు పెళ్లిళ్లు.. అయినా సరే ఇంటింటా వడియాలు, అప్పడాల సందడే.. ఇక ఆలస్యమెందుకు.. మనం కూడా పెట్టుకుందాం వెరైటీ వడియాలు.. ఎర్రటి ఎండలో సూర్యుడికి నైవేద్యం పెడదాం.. ఆయన రుచిచూసి మనకు మరింత రుచిగా అందిస్తాడు.
*
జొన్నపిండితో..
*
కావలసిన పదార్థాలు
జొన్నపిండి: కప్పు
సగ్గుబియం: రెండు చెంచాలు
నీరు: ఐదు కప్పులు ఇంగువ: చిటికెడు
జీలకర్ర: ఒక చెంచా
పచ్చిమిర్చి పేస్ట్: ఒక చెంచా
ఉప్పు: రుచికి తగినంత
*
తయారుచేసే విధానం
ముందుగా సగ్గుబియ్యాన్ని నీటిలో అరగంటపాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గినె్నలో జొన్నపిండి కొద్దిగా నీరు పోసుకుంటూ జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టుకుని జొన్నపిండి మిశ్రమాన్ని అందులో పోసుకుని సన్నని మంటపై పది నిముషాలు ఉడికించుకోవాలి. తరువాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకుని బాగా ఉడికించుకోవాలి. చివరగా దించబోయే ముందు చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ షీట్స్‌పై స్పూన్‌తో వడియాలుగా పెట్టుకోవాలి. ఇవి ఎండలో రెండు, మూడురోజుల పాటు ఎండనివ్వాలి. ఇలా ఎండిన వడియాల్సి డబ్బాలో నిలువ ఉంచుకోవాలి. ఇవి అన్నంలోకే కాదు, సాయంత్రంపూట స్నాక్స్‌లాగా కూడా బాగుంటాయి.
*
బూడిద గుమ్మడితో..
*
కావలసిన పదార్థాలు
బూడిద గుమ్మడికాయ
మినపప్పు: అరకిలో
పచ్చిమిర్చి: 50 గ్రాములు
ఉప్పు: తగినంత
ఇంగువ: కొద్దిగా
*
తయారుచేసే విధానం
*
ముందుగా బూడిద గుమ్మడికాయను ముందు రోజు రాత్రి బాగా కడిగి రాత్రిపూటే చిన్న చిన్న ముక్కలుగా కోసం కొంచెం ఉప్పు వేసి ఆ ముక్కలన్నింటినీ ఒక పల్చని బట్టలో మూటకట్టి ముక్కల్లో నీరంతా పోయేలా వాటిపై బరువును ఉంచాలి. మినపప్పు కూడా రాత్రి నానబెట్టుకోవాలి. తరువాతి రోజు ఉదయానే్న మినపప్పు నీళ్లు తక్కువగా పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిర్చి, ఉప్పు, ఇంగువ మెత్తగా పేస్ట్‌లా చేసి పిండిలో కలపాలి. తరువాత బూడిద గుమ్మడి ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఒక ప్లాస్టిక్ కవర్‌పై మీడియం సైజులో వడియాలు పెట్టుకోవాలి. వడియాలు రెండువైపులా బాగా ఎండేలా చూసుకోవాలి. బాగా ఎండిన వడియాలను వేడి నూనెలో వేసి వేయించుకుని అన్నంతో పాటు కలిపి తినొచ్చు.
*
మినప్పొట్టుతో..
*
కావలసిన పదార్థాలు
మినపప్పు: కప్పు
మినప్పొట్టు: నాలుగు కప్పులు
ఇంగువ: కొద్దిగా
పచ్చిమిరపకాయలు: పది
ఉప్పు: తగినంత
*
తయారుచేసే విధానం
*
మినపప్పును రాత్రంతా నానబెట్టాలి. దీన్ని మెత్తగా రుబ్బాలి. తరువాత పొట్టు, పచ్చిమిర్చి, ఉప్పు, ఇంగువ వేసి కొద్దిగా నీళ్లు వేసి రుబ్బాలి. దీన్ని మెత్తగా రుబ్బకూడదు. ఈ మిశ్రమంలో మెత్తగా రుబ్బుకున్న మినపప్పు మిశ్రమాన్ని కలుపుకోవాలి. దీన్ని ప్లాస్టిక్ కవర్‌పై సరిపడా సైజులో వడియాలను పెట్టుకోవాలి. ఇవి ఒకరోజులో ఆరిపోతాయి. వీటిని నూనెలో వేయించి వేడివేడి అన్నంతో నేతిలో కలుపుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.
*
టొమాటోతో..
*
కావలసిన పదార్థాలు
టొమాటో గుజ్జు: కప్పు
అటుకులు: ఒకటిన్నర కప్పులు
నువ్వులు: పావుకప్పు
కారప్పొడి: రెండు చెంచాలు
జీలకర్ర: చెంచా పచ్చిమిర్చి: మూడు
ఉల్లితరుగు: పావుకప్పు
కొత్తిమీర తరుగు: కొద్దిగా
ఉప్పు: తగినంత
*
తయారుచేసే విధానం
*
నువ్వులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తరువాత టొమాటోలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి పచ్చిమిర్చి, జీలకర్ర జతచేసి మెత్తగా గుజ్జు చేసి పాత్రలోకి తీసుకోవాలి. అటుకుల్ని నీటిలో శుభ్రంగా కడిగి టొమాటో మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ పేపర్‌పై వడియాల్లా పెట్టుకోవాలి. బాగా ఎండిన వీటిని డబ్బాల్లోకి తీసుకోవాలి. వీటిని అన్నంలోకే కాకుండా స్నాక్స్‌లా కూడా తీసుకోవచ్చు.
*
పేలాలతో..
కావలసిన పదార్థాలు
పేలాలు: 500 గ్రాములు
సగ్గుబియ్యం: పావుకప్పు
పచ్చిమిర్చి: 30 గ్రాములు
వాము: ఒక చెంచా
ఉప్పు: తగినంత
*
తయారుచేసే విధానం
*
ఒకటిన్నర కప్పు నీళ్లలో సగ్గుబియ్యాన్ని రెండు గంటలపాటు నానబెట్టాలి. నానబెట్టిన నీళ్లలోనే సగ్గుబియ్యాన్ని కూడా ఉడికించాలి. చిక్కగా అయ్యేవరకూ ఈ మిశ్రమాన్ని కలపాలి. అందులోనే వాము వేసి బాగా కలిపి స్టవ్‌పై నుంచి దించి పక్కన పెట్టాలి. పెద్ద గినె్నలో అరకప్పు పేలాలు పోసి ఒకటిన్నర కప్పు నీళ్లు పోయాలి. మిగిలిన సగం పేలాలతో పాటు మరోకప్పు నీళ్లను కూడా అందులో కలిపి పదినిముషాలు అలాగే ఉంచాలి. తరువాత పచ్చిమిరపకాయలను సన్నటి ముక్కలుగా తరగాలి. నానిన పేలాల్లో ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఉడికించిన సగ్గుబియ్యాన్ని పేలాల మిశ్రమంలో పోసి బాగా కలపాలి. దీన్ని ఒక ప్లాస్టిక్ షీట్‌పై ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా పెట్టాలి. ఇలా పిండి మొత్తాన్ని వడియాలుగా పెట్టాలి. వీటిని బాగా ఎండనివ్వాలి. ఈ పేలాల వడియాలు సాంబారుతో కానీ, రసంతో కానీ చాలా బాగుంటాయి.
*
సగ్గుబియ్యంతో..
*
కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం: కప్పు
మంచినీళ్లు: నాలుగు కప్పులు
పచ్చిమిర్చి: నాలుగు జీలకర్ర: చెంచా
నువ్వులు: పావుకప్పు
*
తయారుచేసే విధానం
*
మందపాటి గినె్నలో నీళ్లుపోసి స్టవ్‌పై ఉంచాలి. బాగా మరిగిన తరువాత సగ్గుబియ్యం పోసి మంట తగ్గించాలి. మధ్యమధ్యలో గరిటతో కలుపుతూ ఓ గంటసేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. సగ్గుబియ్యం పూర్తిగా కరిగిపోయినట్లుగా రంగు లేకుండా అయితే అవి ఉడికినట్లే. తరువాత పాత్రను కిందికి దించి దంచిన పచ్చిమిర్చి, ఉప్పు కలపాల. ఇప్పుడే జీలకర్ర, నువ్వులు కూడా వేయాలి.
కాస్త చిక్కగా గంజిలా ఉన్న దీన్ని చల్లారిన తరువాత ప్లాస్టిక్ కవర్‌పై కావలసిన సైజులో పెట్టుకోవాలి. ఇవి రెండురోజుల్లో ఎండిపోతాయి. వేయించిన సగ్గుబియ్యం వడియాల్ని స్నాక్స్‌లా తినొచ్చు.