భక్తి కథలు

భక్తిమార్గానికి దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పువ్వు వికసించి దాని పరిమళం పిల్లవాయువులతో నలుదిక్కులల్లోను వ్యాపించగానే తేనెటీగలు తమంత తామె దానివద్దకు వస్తాయి. మిఠాయిలను వుంచిన చోటికి చీమలు తమంత తామే వచ్చిచేరుతాయి. తేనెటీగలనుగాని, చీమనుగాని ఎవరూ ఆహ్వానించనక్కర్లేదు. అదేవిధంగా మానవుడు పవిత్రహృదయుడై సిద్ధుడైనప్పుడు అతడి సుశీల సౌరభం అన్ని చోట్లా వ్యాపిస్తుంది. ముముక్షువు లందరూ సహజంగానే అతడి చేత ఆకర్షించబడుతారు. అతని దగ్గరకు వస్తారు. తన మాటలను ఆలకించేవారికోసం వెదుకులాడుతూ అతడు తిరుగాడనక్కర్లేదు అని రామకృష్ణ పరమహంస చెబుతారు.
నిజమే. రామకృష్ణ పరమహంస తాను ఉన్నచోటు నుంచే ఎన్నో మహత్తరకార్యాలను నిర్వర్తించిన ఘనుడు.
సర్వమత సారాన్నీ గ్రహించి, ఆత్మజ్ఞానంతో భగవంతుని సందర్శించవచ్చని నిరూపించిన అద్వైత గురువు శ్రీ రామకృష్ణ పరమహంస.
నిజమైన భక్తాన్వషణతో తాను పూజించే కాళీమాతనే ప్రశ్నించి నిశ్చల ధ్యనంతో సాక్షాత్కరింపజేసుకుని సత్యశోధన పట్ల ఆసక్తి కలిగి సంపూర్ణానుభవ సాధనతో తాను సంగ్రహించిన విషయాలనే తన శిష్యులకు బోధించిన ఆధ్యాత్మిక గురువు ఆయన.పూర్తి జ్ఞానముతో శాశ్వతాశాశ్వతాలను గుర్తెరిగి శ్రద్ధగా ప్రార్థించగలిగితే ప్రతి మనిషీ భగవత్సాక్షాత్కారానికి అర్హులై వివేకవంతులై జీవిస్తారని ఆయన బోధించాడు.
తన గురువుగారైన తోతాపురి సాధువు బాల్యం నుంచీ కష్టపడి సాధించుకున్న నిర్వికల్ప సమాధి స్థితిని శ్రీరామకృష్ణులవారు కేవలం మూడే రోజులలో అభ్యసించగలిగారు. ముఖ్య శిష్యులందరిలోకీ భగవదనే్వషణ చేస్తూ వచ్చి ‘‘మీరు భగవంతుని చూసారా! అన్న ప్రశ్నతో ఆకట్టుకుని సమాధానం పొందిన స్వామి వివేకానంద ముఖ్యుడు ఆయన శ్రీ రామకృష్ణుని సందేశాలు విదేశాలకూ వ్యాపింపజేశాడు
సాంప్రదాయ హిందూమతము 19వ శతాబ్దంలో ముఖ్యంగా ఆయన జన్మస్థలమైన బెంగాల్‌లో పునరుజ్జీవం కావటానికి ఆయనే కారణమయ్యారని చెప్పవచ్చు. ఒక విధంగా భక్తి ఉద్యమకారునిగా భావించే రామకృష్ణుల వారు తన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ తనువు చాలించటానికి ముంద రోజు ప్రియశిష్యుడైన వివేకానందునికి ధారపోశారు. అందుకే వివేకానందుని బోధనలలో చాలావరకూ గురువుగారి ప్రభావం కనిపిస్తుంది. అలాగే ఆయన రామకృష్ణ మిషన్ మరియు రామకృష్ణ మఠములను స్థాపించి ప్రపంచ వ్యాపితం చేశారు.
శ్రీరామకృష్ణ పరమహంస బోధనలు సర్వమానవాళికీ విజ్ఞానదాయకాలు. కలియుగంలో తపము చేయటమంటే సత్యనిరతేనని తెలిపాడు. మాట్లాడటం దేవుడిచ్చిన గొప్పవరమే అయినా మాటలెప్పుడూ అధీనంలో వుండాలని అంటాడు. చప్పట్లు కొట్టే పదివేళ్ళు కన్నా కన్నీరు తుడిచే ఒక్కవేలు మిన్న అని జీవిత సత్యాన్ని చెప్పాడు.అలాగే గురుశిష్యుల బంధాన్ని అండంతో పోల్చి చెబుతూ పెంకు అనే అజ్ఞాన వలయంలో వున్న శిష్యునికి చైతన్యానిచ్చి ఛేదించి బయటపడగల స్థైర్యాన్నిచ్చేవాడే అసలైన గురువని ఎంతో అర్థవంగాతెలిపి అదే విధంగా తన శిష్యులకు, సమాజానికి కూడా మేల్కొలిపే మహిమాన్విత గురోత్తముడిగా పేరుగాంచారు శ్రీరామకృష్ణ పరమహంస. కాబట్టి మహాత్ముల హితవచనాలు సర్వమానవాళికీ ఆసరాగా మారి అందిస్తాయి శుభాశీస్సులు.

-డేగల అనితా సూరి