మెయన్ ఫీచర్

బ్రెజిల్ ప్రజల్లో రగులుతున్న అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ప్రజల దృష్టిని మరల్చడానికై యుద్ధం ఎంతగా తోడ్పడుతుందో, ప్రపంచ స్థాయి పండగలాంటి ఆట లూ అంతే పనిచేస్తాయి. యుద్ధం పాలకుల పట్ల సానుభూతిని, దేశం పట్ల దేశభక్తిని కలిగిస్తే, ఆటలు దేశకీర్తి ప్రతిష్ఠల్ని ఇనుమడింపజేస్తాయి. యుద్ధంలో గెలిచినా, ఓడి నా మిగిలేది బాధ, ప్రాణ, ఆస్తి, ఆర్థిక నష్టం కాగా, ఆటలు గెలిచినా, ఓడినా, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. యుద్ధం మిత్రులతోపాటు శత్రువుల్ని పెంచితే ఆటలు శత్రువుల్ని కూడా మిత్రులుగా మారుస్తాయి. యుద్ధానికి, ఆటలకు గల తాత్విక చింతన ఇది.
ఈనెల 5 నుంచి బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో వైభవంగా ప్రారంభమైన ప్రపంచ ఒలింపిక్ క్రీడలు బ్రెజిల్ ప్రజల నిరసనల మధ్య ప్రారంభమయ్యాయి. బహుశ, ఒలింపిక్ చరిత్రలో ఇలాంటి నిరసనల మధ్య ఆటలు జరగడం ఇదే ప్రథమం కావచ్చు. ప్రజలేకాదు, అక్కడి ఉద్యోగులు, కార్మికులు, న్యాయవాదులు, వైద్యులతో పా టు పోలీసులు కూడా ‘నరకానికి స్వాగతం’ అంటూ రియోకు వచ్చిన క్రీడాకారులకు బ్యానర్లతో స్వాగతం పలకడం గమనించాలి. క్రీడల ప్రారంభానికి ముందు, మూడు నెలలపాటు బ్రెజిల్ నగర వీధుల్లో ఊరేగిన ఒలింపిక్ జ్యోతిపై నిరసనకారులు నీళ్లు చల్లి ఆర్పివేయడం, జ్యోతిని లాక్కోవడం జరిగింది. ప్రధాన క్రీడలు జరిగే ‘మరకనా’ స్టేడియం చుట్టూ అనేక ప్రదర్శనలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. క్రీడల ప్రారంభానికి ముందు దారిద్య్రంతో బతుకీడుస్తున్న మురికివాడల ప్రజలు, నమూనా ఒలింపిక్స్‌ను నిర్వహించి, ‘క్రీడాజ్యోతి- సిగ్గుసిగ్గు’ అంటూ నినాదాలు చేశారు. గత అయిదు నెలల కాలంలో దాదాపు 800 మందికి పైగా నిరసనకారులు పోలీసు కాల్పుల్లో మృతి చెందగా, బ్రెజిల్ ఒలింపిక్‌కు అర్హత సాధించిన 2009 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2,500 మందికి పైగా ప్రజలు భద్రతాదళాల చేతిలో హతమయ్యారు. 75,000 మందికి పైగా ప్రజలను రియో నగరం నుండి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఆటల ప్రారంభం రోజునే స్టేడియం బయట జరిగిన కాల్పుల్లో ఒక మహిళతో సహా ఇద్దరు చనిపోయారు.
అయినా, అగ్రరాజ్యాల నిర్వహణను తలదనే్నలా ఓ అభివృద్ధి చెందుతున్న దేశం అందరిని ఆశ్చర్యపరచే స్థాయిలో ఒలింపిక్ క్రీడలను నిర్వహించడం విశేషమే. నిజానికి బ్రెజిల్‌లో ఇప్పుడున్న వారంతా వలస వచ్చిన పోర్చుగీవారు, యూరప్ దేశస్థులే. 16వ శతాబ్దానికి ముందు రెండు వేలకు పైగా గల మూలవాసులు (జాతులు) ప్రస్తుతం 200కు తగ్గిపోగా, వీరి జనాభా 25 లక్షల నుంచి 8 లక్షలకు కుంచించుకొని పోయింది. స్థానికుల్ని నిరాశ్రయులుగా మార్చి కనుమరుగు చేసే ప్రక్రియ అన్ని దేశాల్లో జరిగినట్లే బ్రెజిల్‌లో కూడా జరిగింది. శే్వత జాతీయలతో పాటు, నల్లజాతివారు కూడా వలసవచ్చినా 99 శాతం మంది పోర్చుగీసు భాషే మాటా లడుతు న్నారు. ఇలా 53 శాతం మిశ్రమ జాతులతో, 52 శాతం మహిళా జనాభాతో వ్యవసాయిక దేశమైన బ్రెజిల్ చెరకు, మొక్కజొన్న, కాఫీ, తేయాకు తోటలకు ప్రసిద్ధి. దీనికి తోడు తీ రం వెంబడి చమురు నిక్షేపాలు వుండటం తో బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉండేది.
ఇలా ఆర్థిక పుష్టితో, ఆత్మీయతతో గల బ్రెజిల్‌ను మనదేశం లాగానే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణలు తమ కబంధ హస్తాల్లో బంధించి వేశాయ. ఫలితంగా ఆర్థిక మాంద్యం, రాజకీయ అస్థిరత, హిం స, హత్యలు, దోపిడీలకు మారుపేరుగా మారింది. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా ఆటగాళ్ల గదుల్లో దొంగతనం జరిగింది. ఇలా ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్న బ్రెజిల్ ప్రజలపై ఆర్థిక ఆంక్షల్ని విధించడం ప్రారంభించింది. అంతర్జాతీయ సంస్థలనుంచి ఇబ్బడి ముబ్బడిగా అప్పుల్ని తెచ్చింది. వీటిని చక్కదిద్దడానికై ‘లులా డస్మిలా’, ‘దిర్మా రౌసెఫ్’ లాంటి వామపక్ష దేశాధ్యక్షులు గత ఐదువందల ఏళ్లుగా కొనసాగుతున్న జాతి వివక్షతకు అడ్డుకట్ట వేయడం ప్రారంభించారు. విశ్వవిద్యాలయాలలో నల్ల జాతీయులకు సీట్లను కేటాయించారు. కార్మికులకు కనీస వేతనాల్ని, హక్కుల్ని కల్పించారు. ఇవన్నీ గిట్టని వ్యాపార వర్గాలు బానిసలు కూడా సాధారణ, మధ్యతరగతి పౌరులుగా ఎదగడం సహించలేమని బాహాటంగా సహాయ నిరాకరణ ప్రారంభించారు. లూలాపై, దిర్మాపై అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు మోపారు. ప్రధానంగా బ్రెజిల్ చమురు సంస్థ పెట్రోబ్రాస్ నిధుల దుర్వినియోగం వీరి మెడకు చుట్టుకుంది. దేశ జిడిపిలో ఐదుశాతం వాటాగల ఈ సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మం త్రులపైనా, ఎంపిలపైనా ఆరోపణలు వచ్చా య. ప్రతిపక్షం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా, సెనెట్ ఆమోదించడంతో మొదటి మహిళా దేశాధ్యక్షురాలైన దిల్మా తన పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి ప్రజాదరణలేని ఉపాధ్యక్షుడైన మైఖేల్ టైమర్ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఇదంతా ఓ కుట్ర ఫలితంగా జరిగిందనేది ప్రజల ఆరోపణ. 2011లో జరిగిన స్వేచ్ఛాపూరిత ఎన్నికల్లో దిల్మా ఎన్నికైందనేది కొందరి వాదన. నిజానికి బ్రెజిల్ చరిత్రలో ప్రజాస్వామ్య ప్రస్థానం తక్కువనే. 1964 నుంచి 1985 దాకా సైనిక పాలనలోనే కొనసాగగా, ఇప్పటి టైమర్ కేబినెట్‌లో ఉన్న 22 మంది మగవారేకాక, శే్వత జాతీయులు కావడం గమనార్హం. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఒలింపిక్స్ జరగడం ప్రజల కోపాగ్నికి కారణమైంది. నిజానికి బ్రెజిల్ ప్రజలు సాకర్ ప్రియులు. మన హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌లా వీరికి పిలె అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడున్నాడు. ఈసారి ఒలింపిక్ జ్యోతిని వెలిగించాల్సిన 75 సంవత్సరాల పిలె ఆరోగ్యం బాగాలేదని చివరి నిముషంలో హాజరు కాకపోవడం ఒలింపిక్ చుట్టూ గల నీలినీడల్ని బహిర్గతం చే సింది. చివరికి ప్రపంచ స్థాయి అథ్లెట్ వాం డల్లి కార్డిరో జ్యోతిని వెలిగించాల్సి వచ్చింది.
భారతదేశానికి మూడింతల భూభాగంలో, కేవలం 20 కోట్ల జనాభాతో విశాలమైన వ్యవసాయ క్షేత్రాలతో, యావత్ యూ రప్ దేశాలకి పంచదారను ఎగుమతి చేసే బ్రెజిల్ మనలాగే కష్టసుఖాల్ని, సుఖ దుఃఖాల్ని దిగమింగుతున్నది. ఆర్థికాభివృద్ధి పుష్టిగా ఉన్నప్పుడు ఉన్నత, మధ్యతరగతి ప్రజలు తీసుకున్న గృహ రుణాలు తిరిగి చెల్లించలేని స్థితి. చివరికి పోలీసు శాఖకిచ్చే నిధుల్లో మూడోవంతు కోత విధించడంతో నియంత్రణ కరవై 15 శాతం నేరాలు పెరిగాయి. ప్రస్తుతం క్రీడాకారులకు 85వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నా మొన్నటి పదో తేదీన జర్నలిస్టు బృందంపై కాల్పులు జరిగాయి. నిజానికి ఒలింపిక్ లాంటి క్రీడలకు ఆతిథ్యాన్నిస్తున్నందుకు ప్రజలు సంతోషించాలి. కాని అందుకు పూర్తి భిన్నంగా మాకు ఇళ్లు కావాలి, పాఠశాలలు కావాలి, ఉద్యోగాలు, ఉపాధి కావాలి, ప్రాథమిక సౌకర్యాలు కావాలి, క్రీడలు కాదు, అంటూ ఒలింపిక్ క్రీడల సాక్షిగా ప్రజలు నిరసన వ్యక్తం చేయడంపై బ్రెజిల్ మాత్రమే కాదు, బ్రెజిల్ వంటి దేశాలు ఆలోచించాలి. బ్రిక్స్ దేశాల్లో భాగమైన భారత్ ఆలోచించాలి. అంత ర్జాతీయ పండుగల పేరున అసంతృప్తితో రగిలిపోతున్న ప్రజలను పక్కదారి పట్టిం చడానికి అక్కడి ప్రభుత్వాలు ప్రయ త్నిస్తున్నాయన్నది మే ధావుల విశే్లషణ. కాని ఈ సారి ప్రభుత్వం ప్రజల నిరసనను ప్రపంచానికి వెల్లడి కాకుండా కప్పిపుచ్చ లేకపోయంది.
గత దశాబ్ద కాలంగా, బ్రెజిల్ ఇలాంటి ఓ అరడజనుకు పైగా కార్యక్రమాలకు ఆతిథ్యాలనిచ్చింది. 2007లో పాన్ అమెరికా ఆటలకు, 2012లో రియో+20 పర్యావరణ సదస్సుకు, 2013లో కానె్ఫడరేషన్ కప్‌కు, 2014లో ప్రపంచ ఫుట్‌బాల్ కప్‌కు వేదికగా మార్చి కోట్లాది డాలర్లను ఖర్చు చేసింది. పేరుగొప్ప, ఊరుదిబ్బలా ఈసారి 12,000 కోట్ల డాలర్లను ఒలింపిక్ నిర్వహణకు ఖర్చు చేస్తున్నది. ఇది బ్రెజిల్ ప్రజలకు తలకుమించిన భారం. అందుకే 63 శాతానికి పైగా ప్రజలు ఒలింపిక్స్‌ను నిర్వహించవద్దన్నారు. ఇంట ఆకలిమంటలుంటే, బయట డప్పుల మోత ఎందుకనేది వారివాదన. నిజానికి ఇది బ్రెజిల్ సమస్యనే కాదు. ఓ గ్రీస్ దేశ సమస్య, ఓ బ్రిటన్ సమస్య, ఐర్లాండ్ సమ స్య, యావత్ భారత ఉపఖండం సమస్య. 2012లో 15వేల కోట్లకు పైగా డాలర్లు ఖర్చు చేసిన బ్రిటన్ చివరికి యూరోపియన్ యూ నియన్నుంచి బయటకు రావడమే కాదు, ప్రధానమంత్రి కామెరూన్ రాజీనామాకు దారితీసింది. లండన్ తగలబడింది. ఇలా అంతర్జాతీయ వేడుకలతో దేశ ప్రజల్ని భవిష్యత్తులో కోలుకోకుండా చేయడం ఆలోచించదగ్గ విషయం కాదా?
నిజానికి ఆటలు శ్రమనుంచి పుట్టినవే! కాని అవి అత్యంత ఖరీదైనవిగా, విలాసవంతంగా మారడం దేశాల ఆర్థిక సంపదపై పడటం ఓ తీవ్రమైన అంశం. అందుకే కాబోలు గ్రీకును జయించిన రోమన్ చక్రవర్తి థియోడోసియస్ క్రీస్తుశకం 393లోనే వీటిని నిషేధించాడు. తిరిగి 1500 సంవత్సరాల తర్వాత ఫ్రెంచ్ క్రీడాభిమాని పియరీడి కోబర్టీన్ ప్రోత్సాహంతో ఆధునిక ఒలింపిక్స్, 1896 నుంచి తిరిగి ప్రారంభమై నేటికీ కొనసాగుతున్నాయ. ఇలా తిరిగి మొదలైన ఒలింపిక్స్ మొదటి, రెండో ప్రపంచ యుద్ధకాలంలో నిర్వహించలేదు. మిగతా సందర్భాల్లోకూడ రాజకీయ, వలసవాద, జాత్యహంకార కారణాలను చూపు తూ, కొన్ని దేశాలు, తమకు గిట్టని దేశాలు ఆతిథ్యం ఇచ్చినప్పుడల్లా వీటిని బహిష్కరించడం జరుగుతూనే ఉంది.
దేశ ఆర్థిక పుష్టి బాగా ఉన్నప్పుడు, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో అలరారుతుం టే, వీటిని నిర్వహించడంలో తప్పులేదు. అందునా, ఆటలు ప్రజల మధ్యనేకాదు, దేశాల మధ్యన సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయి. కాని, ప్రజల నోళ్లు కొట్టి నిర్వహించడమే ఆక్షేపణీయం. ఈ స్థితిని 1982లో నిర్వహించిన ఆసియా క్రీడల సందర్భంగా అప్పటి ప్రభుత్వం, కామన్‌వెల్త్ క్రీడలు ని ర్వహించిన గత యుపిఎ ప్రభుత్వం గుర్తిం చాయ కూడా. అయినా ప్రభుత్వాలు దేన్నీ గుణపాఠంగా స్వీకరించపోవడమే విషా దం.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162