రాష్ట్రీయం

శారదాపీఠంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 3: ఏపీ సీఎం జగన్ ఉండగానే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ పీఠాన్ని సందర్శించారు. సీఎం జగన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై మర్యాదపూర్వకంగా కలుసుకున్న అనంతరం జగన్ తిరుగుప్రయాణమయ్యారు. అనంతరం గవర్నర్ తమిళిసై పీఠం ఆవరణలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వరూపానందేంద్రను కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి శారదాపీఠాన్ని సందర్శించి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి స్వామీజీ తత్త్వమసి గ్రంథాన్ని అందజేశారు.
*చిత్రం...గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌కు తత్త్వమసి గ్రంథాన్ని అందజేస్తున్న విశాఖ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి