రాష్ట్రీయం

11న వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 8: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే 65 సంవత్సరాలు పైబడ్డ వృద్ధులకు, దివ్యాంగులకు ఈనెల 11వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టీటీడీ 4వేల టోకెన్లను జారీ చేసింది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. అలాగే 12వ తేదీన 5 సంవత్సరాల్లోపు పిల్లలను వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరంలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.