రాష్ట్రీయం
శ్రీవారిసేవలో శ్రీలంక ప్రధాని
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 11 February 2020
తిరుపతి: శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే శ్రీవారి దర్శనార్థం సోమవారం రాత్రి 7.35 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి భవనం వద్ద రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఈఓ ఏకే సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డిలు ఆయనకు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లుచేశారు. కాగా శ్రీలంక ప్రధాని వెంట ఆయన కుమారుడు యోషితా రాజపక్సే, ఆ దేశ మంత్రి ఆర్ముగన్ తొండమాన్ ఉన్నారు. మంగళవారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.