ఆంధ్రప్రదేశ్
220 తాబేళ్ల స్వాధీనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 23 October 2016
గూడెంకొత్తవీధి, అక్టోబర్ 22: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలం మొల్లిమెట్ట, దుచ్చరిపాలెం గ్రామాల సమీపంలో శనివారం అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 220 తాబేళ్ళను ఫారెస్ట్ టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. టేకు తోటలు, ఇతర కాఫీ ప్లాంటేషన్ల రక్షణలో భాగంగా శుక్రవారం సాయంత్రం టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుండగా కనిపించిన మూటలు అనుమానంగా ఉండడంతో వాటిని పరిశీలించారు. మొదట గంజాయి అనుకున్నప్పటికీ అవి విప్పి చూడడంతో తాబేళ్ళుగా గుర్తించారు. వీటిని చింతపల్లి ఫారెస్ట్ కార్యాలయానికి తరలించి పరీక్షించడంతో 220 తాబేళ్ళలో 16 మరణించినట్లు సిబ్బంది గుర్తించారు. ఈతాబేళ్ళు మడ్థెరిపిన్ జాతికి చెందిన తాబేళ్ళుగా అధికారులు చెబుతున్నారు.