రాష్ట్రీయం

నేత్రపర్వంగా ధర్మపురి క్షేత్రంలో ప్రారంభమైన లక్ష్మీనారసింహుడి వసంతోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఏప్రిల్ 27: ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం రాత్రి లక్ష్మీనారసింహుని వసంతోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ నవరాత్రి ఉత్సవాల్లో అంతర్భాగంగా దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర నారసింహాలయాలలో శుక్రవారం పల్లవోత్సవం, వసంతోత్సవం, పుష్పోత్సవం, నానావిధ ఫల రసోత్సవాది వేడుకలను సనాతన సంప్రదాయ వేదోక్త రీతిలో నిర్వహించారు. దేవస్థానం ఏసీ, ఈఓ సుప్రియ ఆధ్వర్యంలో చైర్మన్ డా. ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ధర్మకర్తలు వెంకటేశ్వర్ర్రావు, రమాదేవి, సునీల్ కుమార్, నరేందర్, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి తదితరులున్నారు. వేడుకల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.