రాష్ట్రీయం

దుర్గమ్మ సేవలో మహేశ్‌బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), ఏప్రిల్ 27: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను సినీ నటుడు, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆయన వెంట భరత్ అనే నేను సినిమా డైరెక్టర్ కొరటాల శివ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తదితరులు ఉన్నారు. తొలుత అమ్మవారి రాజగోపురం వద్ద ఎమ్యెల్సీ బుద్దా వెంకన్న, దుర్గగుడి ఈవో ఎం పద్మ, కమిటీ చైర్మన్ వీ గౌరంగబాబు, తదితరులు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం తర్వాత మహేష్‌బాబు, కొరటాల శివ, తదితరులకు దేవస్థానం అర్చకులు దివ్య ఆశీస్సులు అందచేయగా, ఈవో అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రత్యేక ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ధర్మకర్తలు గూడపాటి పద్మశేఖర్, వెలగపూడి శంకరబాబు, ఈ పెంచలయ్య, కే సూర్యలతకుమారి, లింగంబొట్ల దుర్గాప్రసాద్, పాల్గొన్నారు.