రాష్ట్రీయం

సరస్వతమ్మకే ఎమ్మెల్సీ టికెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు భార్య సరస్వతమ్మకు టీడీపీ అధిష్టానం టిక్కెట్ ఖరారు చేసింది. ముఖ్యమంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ మేరకు శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని గాలి కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. గాలి మృతితో ఖాళీ ఏర్పడిన స్థానానికి ఆయన కుమారులు ఇద్దరూ పోటీపడ్డారు. దీంతో మధ్యే మార్గంగా గాలి భార్యకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. గాలి కుటుంబ సభ్యుల్లో ఏకాభిప్రాయం మేరకే ఈ టికెట్‌ను ఖరారు చేశారు.